Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం..ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు..

Dharmapuri Arvind Interview: తెలంగాణ బీజేపీ ఫైర్ బ్రాండ్.. ఉన్నది ఉన్నట్టు కుండబద్దలు కొట్టేలా మాట్లాడే ధర్మపురి అరవింద్.. తాజాగా జీ మీడియా ఎడిటర్ భరత్ కు స్పెషల్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో నెలకున్న తాజా రాజకీయ పరిస్థితులు.. బీజేపీ పార్టీలో నెలకున్న ఇతర అంశాలపై మాట్లాడారు.  

Written by - TA Kiran Kumar | Last Updated : Nov 20, 2024, 12:24 PM IST
Dharmapuri Arvind: మా నేతల లోపాల వల్లే తెలంగాణలో ఓడిపోయాం..ఎంపీ అరవింద్  సంచలన వ్యాఖ్యలు..

Dharmapuri Arvind: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల్లో మా నేతల లోపాల వల్లే ఇక్కడ ఓడిపోయాము. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత ఉన్నా..మేము ఆల్టర్ నేటివ్ గా కనిపించలేదు. అందుకే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు అధికారం కట్టబెట్టారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మా పార్టీ నిజామాబాద్, ఆదిలాబాద్ లో గెలిచింది.  అక్కడ మా పార్టీ నేతలతో కలిసి పనిచేయడం వల్ల.. నార్త్ తెలంగాణలో 7 సీట్లు వచ్చాయి. రాజా సింగ్.. మాత్రం సొంతంగా గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.

Add Zee News as a Preferred Source

బండి సంజయ్ తో మాకు విభేదాలు లేవు. బండి సంజయ్ లో కొన్ని ఫెల్యూర్స్ ఉన్నాయి. మరోవైపు పార్టీ అధ్యక్ష రేసులో ఉన్న విషయాన్ని ప్రస్తావిస్తే.. ఇస్తే తన సత్తా ఏంటో  చూపిస్తాన్నారు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో మాకు ఓటెయని ప్రజలు.. పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచినా.. అది ఇక్కడ పార్టీ నాయకుల గొప్పతనం కాదు. నరేంద్ర మోడీ చేసిన పని.. జాతీయవాదం.. అమిత్ షా చాణక్యం వల్లే ఇక్కడ ఎనిమిది ఎంపీ సీట్లు గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.

ఇక ఎంపీ ఎన్నికల్లో నాకు టిక్కెట్టు ఇవ్వొద్దని కొందరు అధిష్ఠానానికీ కంప్లైంట్ చేశారు. అపుడు అల్టరేనేట్ ఎవరని అడిగితే.. ఆయనకు తప్పించి ఎవరికిచ్చినా.. అభ్యంతరం లేదని చెప్పారు. మొత్తంగా అధిష్ఠానం నాకు టికెట్ ఇచ్చింది.రెండు సార్లు బలమైన క్యాండిడేట్స్ పై గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు. మొదటి సారి కవితపై .. రెండోసారి జీవన్ రెడ్డిపై గెలిచిన విషయాన్ని ప్రస్తావించారు.

 కేటీఆర్ ఢిల్లీలో ఏ కేంద్ర మంత్రిని గెలవలేదు.  రేవంత్ తో నాకు మంచి దోస్తానా ఉంది. అంతేకాదు కాంగ్రెస్ నేతలైన కోమటిరెడ్డి, శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క, దామోదర్ రాజనరసింహ వంటి వారు నాకు దోస్తులున్నారు. రేవంత్ పాలనా పూర్.. గ్రామాల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. రేవంత్ రెడ్డి .. ఓవైసీ కాలేజీలో అడుగుపెట్టే దమ్ముందా.. ఓల్డ్ సిటీలో అడుగుపెట్టకుండా.. మూసీ ప్రక్షాళన చేయడం అసాధ్యమన్నారు. ఏ ఆయన ఏం చేయబోతున్నాడో చూడాలన్నారు. నరేంద్ర మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు అహ్మదాబాద్ లో ని సబర్మతి నది సుందరీకరణ చేసారు. అంతకు ముందే.. నిర్వాసితులకు ఇండ్లు.. పునరావాసం కల్పించిన తర్వాతే సబర్మతి నది బాగు పడిందన్నారు. కానీ మూసీ సుందరీకరణ విషయంలో రేవంత్ రెడ్డి.. నిర్వాసితులకు పునరావాసం కల్పించకుండా ఎలా ప్రక్షాళన చేస్తారనేది చూడాలన్నారు.

ఇదీ చదవండి : Balayya Heroine: ఎఫైర్స్ తో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచిన బాలయ్య భామ.. మైండ్ బ్లాంక్ చేస్తోన్న హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్..

ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

About the Author

TA Kiran Kumar

కిరణ్ కుమార్ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

...Read More

Trending News