Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి

Drunked Man Attacked By Junior Doctor In Gandhi Hospital Secunderabad: వైద్యం అందిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై ఉన్న ఫలంగా చేయి పట్టుకుని ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. ఈ సంఘటన వైద్య రంగాన్ని నివ్వెరపరిచింది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 11, 2024, 10:26 PM IST
Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో కలకలం.. మహిళా డాక్టర్‌ చేయి పట్టుకు లాగిన రోగి

Woman Doctor Attacked By Patient: తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద ప్రభుత్వ ఆస్పత్రి అయిన గాంధీ ఆస్పత్రిలో ఓ రోగి వైద్యురాలిపై దాడికి పాల్పడ్డాడు. చికిత్స అందిస్తున్న జూనియర్‌ వైద్యురాలిపై దారుణంగా వ్యవహరించాడు. ఆమె చేయి పట్టుకుని దాడికి పాల్పడడంతో కలకలం రేపింది. దేశవ్యాప్తంగా వైద్యులపై దాడులు జరుగుతున్న విషయం మరువకముందే తెలంగాణలో మహిళ డాక్టర్‌పై దాడి జరగడంతో వైద్యులకు రక్షణ కరువైందనే చర్చ మొదలైంది. కాగా ఈ దాడిపై గాంధీ ఆస్పత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఆందోళనకు దిగారు.

Also Read: Insta Reels: ఇన్‌స్టా రీల్స్‌ పిచ్చి.. రైలు పట్టాలపై ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

హైదరాబాద్‌ సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిని అత్యవసర విభాగంలో ఓ మహిళ జూనియర్ డాక్టర్‌పై పేషంట్ సహాయకుడు (60) దాడికి పాల్పడ్డాడు. మహిళా వైద్యురాలిపై చేయి పట్టుకొని దాడి చేశాడు. వెంటనే తేరుకున్న తోటి వైద్యులు వెంటనే వారించారు. మిగతా వారు అతడిపై పిడిగుద్దులతో దాడి చేశారు. వైద్యురాలిని అతడి దాడి నుంచి కాపాడారు. అనంతరం అతడిని పరిశీలించగా మద్యం మత్తులో ఉన్నట్లు గుర్తించారు. తాగిన మైకంలో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. వైద్యురాలిపై దాడికి పాల్పడిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డయ్యాయి. ఆ వీడియో కాస్త వైరల్‌గా మారింది. 

Also Read: September 17th: రేవంత్‌ సర్కార్‌ కీలక నిర్ణయం.. సెప్టెంబర్‌ 17వ తేదీకి మరో కొత్త పేరు

కాగా దాడి అనంతరం వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకుని చిలకల గూడ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. జూనియర్ డాక్టర్లు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమపై దాడికి పాల్పడిన అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తరచూ రోగులు, వారి సహాయకుల నుంచి ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతుండడంతో జూనియర్‌ వైద్యులు ఆందోళన చెందుతున్నారు. తమకు రక్షణ కావాలని కోరుతున్నారు. కాగా గురువారం నుంచి జూనియర్‌ డాక్టర్లు ఆందోళన చేపట్టే అవకాశం ఉంది.

దాడి విషయమై జూనియర్‌ వైద్యులు గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్‌ రాజకుమారిని కలిశారు. జరిగిన విషయాన్ని ఆమెకు తెలిపారు. వెంటనే అతడిపై కేసు నమోదు చేయించాలని డిమాండ్‌ చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జూడాల ఫిర్యాదుపై స్పందించిన సూపరింటెండెంట్‌ విచారణకు ఆదేశించారు. విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. వైద్యులకు బందోబస్తును కూడా పెంచుతామని హామీ ఇచ్చారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News