తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమే: సినీ నటుడు మోహన్ బాబు

తెలంగాణ ఎన్నికలలో మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని సినీనటుడు మోహన్ బాబు జోస్యం చెప్పారు. 

Last Updated : Nov 11, 2018, 01:30 PM IST
తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వచ్చేది టీఆర్ఎస్ మాత్రమే: సినీ నటుడు మోహన్ బాబు

తెలంగాణ ఎన్నికలలో మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ మాత్రమే అధికారంలోకి వస్తుందని సినీనటుడు మోహన్ బాబు జోస్యం చెప్పారు. టీఆర్ఎస్ అధికారంలోకి రావాలని తాను మనస్ఫూర్తిగా కోరుకంటున్నానని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఫిల్మ్ నగర్ ప్రాంతంలోని దైవ సన్నిధానం ఆలయానికి అధ్యక్షుడిగా ఉన్న మోహన్ బాబు.. ఆలయాన్ని సందర్శించిన తెలంగాణ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో ముచ్చటించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న పనులు చాలా బాగున్నాయని.. అందుకే మళ్లీ ఆ ప్రభుత్వమే అధికారంలోకి వస్తే బాగుంటుందని తాను భావిస్తున్నానని మోహన్ బాబు తెలిపినట్లు సమాచారం.

ఈ సంవత్సరమే దైవ సన్నిధానం ఆలయ కమిటీ అధ్యక్షుడిగా మోహన్ బాబు బాధ్యతలు స్వీకరించారు. ప్రముఖ నటుడు గిరిబాబు, మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ, పరుచూరి గోపాలకృష్ణ, కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి, క్రికెటర్ చాముండేశ్వరీనాథ్ మొదలైనవారు ప్రస్తుతం ఈ దైవ సన్నిధానం ఆలయ కమిటీలో  సభ్యులుగా ఉన్నారు. 

సినీనటుడు మంచు మోహన్ బాబు 2018లో మహానటి చిత్రంలో స్వర్గీయ ఎస్వీ రంగారావు పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఆ పాత్రకు ఆయనకు విమర్శల ప్రశంసలు కూడా దక్కాయి. అలాగే ఈ సంవత్సరం ఆయనే నిర్మాతగా వ్యవహరించి తీసిన "గాయత్రి" చిత్రం ఆశించిన స్థాయి విజయాన్ని సాధించలేదు. 

Trending News