గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్పీఎస్సీ

గ్రూప్ -2 పరీక్ష రాసిన అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్పీఎస్సీ. 

Last Updated : Jun 27, 2019, 11:00 PM IST
గ్రూప్ 2 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పిన టీఎస్పీఎస్సీ

హైదరాబాద్‌: గ్రూప్ -2 పరీక్ష రాసిన అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ గుడ్ న్యూస్ వినిపించింది. పరీక్ష రాసి ఇంటర్వ్యూ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులను జూలై మొదటి వారంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ చైర్మన్ ఘంటా చక్రపాణి తెలిపారు. విద్యాశాఖ నుంచి అనుమతులు రాగానే నియామకాలు పూర్తి చేస్తామని ఘంటా చక్రపాణి స్పష్టంచేశారు. 

2017-18 ఏడాదికి సంబంధించిన కమిషన్ వార్షిక నివేదికను ఘంటా చక్రపాణి రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్ఎల్ నరసింహన్‌కు అందజేశారు. గవర్నర్‌తో భేటీ వివరాలను మీడియాకు వెల్లడించిన ఆయన.. వివాదాలు లేకుండా నియామకాలు పూర్తి చేస్తున్నందుకు గవర్నర్ అభినందించారని అన్నారు.

Trending News