భార్యను కిడ్నాప్ చేసిన భర్త.. హైదరాబాద్ లో వింత సంఘటన..

రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటు  చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం..

Last Updated : Apr 16, 2020, 08:28 PM IST
భార్యను కిడ్నాప్ చేసిన భర్త.. హైదరాబాద్ లో వింత సంఘటన..

హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా లాక్ డౌన్  నేపథ్యంలో హైదరాబాద్ లో ఓ వింత సంఘటన చోటు  చేసుకుంది. అదనపు కట్నం కోసం భార్యను కిడ్నాప్ చేసిన సంఘటన నగరంలోని మాసబ్ ట్యాంక్‌లో జరిగింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం ప్రకారం..హైదరాబాద్ నగరంలోని శాంతినగర్‌కు చెందిన మహ్మద్ షరీఫ్ అనే వ్యక్తికి  ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. షరీఫ్ తన ఆస్థిని ఇద్దరు కుమార్తెలకు సమానంగా భాగాలుగా ఇచ్చాడు. చిన్న కుమార్తె అస్మా సల్మాన్‌తో వివాహం కాగా, వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

Also read : Mobile app: ఆ మొబైల్ యాప్‌తో తస్మాత్ జాగ్రత్త! కేంద్రం హెచ్చరిక

అయితే గత కొంత కాలం నుంచి అదనపు కట్నం తేలవాలని భర్త వేదించడంతో తండ్రి వద్ద ఉంటోందని, ఈ క్రమంలో తండ్రి షరీఫ్‌ అనారోగ్యం పాలవ్వడంతో తన కూతురితో ఆస్పత్రికి వెళ్లేందుకు బయటికి వచ్చారు. ఇదే సమయంలో బయట ఉన్న సల్మాన్, అతడి స్నేహితులు అస్మాను కిడ్నాప్ చేసేందుకు యత్నించారు. తండ్రి అడ్డుకునేందుకు యత్నించగా దాడి చేయడంతో షరీఫ్ కు తీవ్ర గాయాలు కాగా, చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. తన కూతురిని ఎక్కడికి తీసుకుపోయారో  తెలియడంలేదని షరీఫ్ ఆవేదన వ్యక్తం చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x