ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. ప్రేమోన్మాది ఘాతుకమేనా?

కరీంనగర్ పట్టణ కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థినిని ఓ దుండగుడు గొంతుకోసి దారుణంగా హత్య చేయడం స్థానికంగా కలకలం రేపుతోంది. 

Last Updated : Feb 11, 2020, 07:22 AM IST
ఇంటర్ విద్యార్థిని దారుణ హత్య.. ప్రేమోన్మాది ఘాతుకమేనా?

కరీంనగర్: జిల్లా కేంద్రంలో దారుణం చోటు చేసుకుంది. ఓ ఇంటర్ విద్యార్థిని సోమవారం దారుణహత్యకు గురైంది. ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై గుర్తుతెలియని యువకుడు దాడి చేసి కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. పట్టణంలో సోమవారం సాయంత్రం ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. రాధిక స్థానిక విద్యానగర్‌లో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోంది. కరీంనగర్ లోని సహస్ర జూనియర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. 

ఈ క్రమంలో సోమవారం ఉదయం తల్లిదండ్రులు ముత్త ఓదెమ్మ, కొమురయ్యలు కూలీపనికి వెళ్లారు. సాయంత్రం అటుగా వెళ్లిన బాలుడు చూసేసరికి రాధిక కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతోంది. పొరుగువారికి చెప్పగా వెంటనే హాస్పిటల్‌కు తరలించారు. అయితే అప్పటికే రాధిక చనిపోయిందని వైద్యులు నిర్ధారించారు. పొరుగువారి నుంచి సమాచారం అందుకుని హాస్పిటల్‌కు వచ్చిన ఓదెమ్మ, కొమురయ్యలు కూతున్ని విగతజీవికి చూసి కన్నీటి పర్యంతమయ్యారు. నిందితుడ్ని పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ దంపతుల కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నాడు.

Also Read: గోడ విషయంలో గొడవ.. AK-47తో కాల్పుల కలకలం

ప్రేమ వివాదమే కారణమా?
రాధిక గత కొంతకాలంగా తమ ఇంట్లో అద్దెకు ఉండే యువకుడితో ప్రేమలో ఉందని.. హత్యకు ప్రేమ వివాదమే కారణమై ఉంటుందా అనే కోణంలోనూ దర్యాప్తు చేపట్టారు. ఇంట్లో అద్దెకుండే వారిని కొంతకాలం కిందట ఇళ్లు ఖాళీ చేపించారని తెలుస్తోంది. నాలుగు తులాల బంగారంతో పాటు కొంతమేర నగదు చోరీకి గురైనట్లు ఓదెమ్మ పోలీసులకు తెలిపింది. యువకుడితో ప్రేమ విషయం తెలిసి రాధికను తల్లిదండ్రులు మందలించడం, అద్దెకుండే యుకుడి కుటుంబాన్ని ఖాళీ చేపించడం బాలిక హత్యకు దారి తీసి ఉండొచ్చునని స్థానికంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Also Read: ‘దిశ చెల్లెలి విషయంలో జాగ్రత్త పడుతున్నాం’

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News