Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్.. కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Fires on KTR: మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు బండి సంజయ్. తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ కేటీఆర్‌ చేసిన కామెంట్స్‌ను ఖండించారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు ఒక్క ఓటు కూడా వేయొద్దని పిలుపునిచ్చారు.  

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2024, 06:19 PM IST
Bandi Sanjay: అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్.. కేటీఆర్‌పై బండి సంజయ్ ఫైర్

Bandi Sanjay Fires on KTR: తెలంగాణ ప్రజలకంటే ఆంధ్రోళ్లు తెలివైన వాళ్లంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ భగ్గుమన్నారు. ‘‘కొట్లాడి రాష్ట్రం సాధించిన తెలంగాణ ప్రజలను తెలివిలేనోళ్లంటావా? అమెరికాలో చిప్పలు కడిగిన నీకు అధికారం అప్పగిస్తే.. తెలివిలేనోళ్లంటావా. సకల జనుల సమ్మె చేసి ఉద్యోగాలనే ఫణంగా పెట్టిన తెలంగాణ ఉద్యోగులను తెలివిలేనోళ్లంటావా? తెలంగాణ కోసం పోరాడి బలిదానమైన 14 వందల మంది నీకు తెలివిలేనోళ్లా?’’ అంటూ నిప్పులు చెరిగారు. తెలంగాణలో తెలివిలేనోళ్లు మాత్రమే బీఆర్ఎస్‌కు ఓటేయాలని, తెలివి ఉన్నోళ్లెవరూ బీఆర్ఎస్‌కు ఓటేయొద్దని, బీజేపీని గెలిపించాలని కోరారు.

"మా తెలంగాణోళ్లకు తెలివి లేదా..? సిగ్గుండాలే.. మా తెలంగాణ ప్రజలకు తెలివిలేదు కాబట్టే తెలంగాణ కోసం ఉద్యమం చేసి 14 వందల మంది బలిదానమయ్యారా..? మా తెలంగాణ వాళ్లకు తెలివి లేదు కాబట్టే తెలంగాణ సాధించుకున్నమా..? మా తెలంగాణోళ్లకు తెలివి లేదు కాబట్టే మీకు అధికారం కట్టబెట్టామా..? మా తెలంగాణ ఉద్యోగులు తెలివిలేకనే సకల జనుల సమ్మె చేశారా..? ఇప్పుడు.. మీకు తెలంగాణ ప్రజలు తెలివి లేనోళ్లుగా కన్పిస్తున్నారా..?
సిగ్గుండాలే.. తెలంగాణ ప్రజలారా.. కేటీఆర్ కొడుకు మాటలు విన్నారు కదా.. మనమంతా తెలివిలేనోళ్లమట. దద్దమ్మమలట. మీ అందరికీ అప్పీల్ చేస్తున్నా.. ఇక మీరంతా ఆలోచించండి.. మనకు తెలివి ఉందా..? లేదా..? తెలివిలేనోళ్లంతా బీఆర్ఎస్‌కు ఓటేయండి.. తెలివి ఉన్నోళ్లంతా బీజేపీకి ఓటేయండి.. 

సిగ్గులేని పార్టీ బీఆర్ఎస్.. తెలంగాణ ప్రజల ఓట్లు వేస్తేనే మీ అయ్య సీఎం అయ్యిండు.. అమెరికాలో చిప్పలు కడుక్కునే నువ్వు మంత్రి అయినవ్. నీ చెల్లి ఎంపీ, ఎమ్మెల్సీ అయ్యింది.. తెలంగాణ కోసం కొట్లాడి వందలాది మంది బలిదానమై తెలంగాణ సాధించి నీకు అధికారమిస్తే.. వేల కోట్లు దోచుకున్న మీ కుటుంబం తెలంగాణ ప్రజలకు ఇచ్చిన బిరుదు ‘తెలంగాణోళ్లకు తెలివి లేదని అంటవా?’.. తెలంగాణ ప్రజలారా.. ఈ ఎన్నికలు ఓటుతో కొడితే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల దిమ్మ తిరగాలే.. ఒక్క ఓటు కూడా వేయొద్దు... అప్పుడు తెలంగాణ ప్రజల తెలివి ఏందో తెలుస్తది.. బహుశా.. కేటీఆర్‌కు చేపల పులుసు ఎఫెక్ట్ పడ్డట్లుంది. చేపల పులుసు తిన్నాక తెలంగాణోళ్లు తెలివి లేనోళ్లుగా కన్పిస్తున్నారా..

నేను ఈడీ, సీబీఐ అధికారిని కాదు.. కవితను ఎందుకు అరెస్ట్ చేశారో.. ఏ ఆధారాలున్నాయో ఈడీ, సీబీఐని అడగండి.. ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవం. దీనిపై బాధ్యులైన నేతలను ఎందుకు అరెస్ట్ చేయరు. ఈ రాచమర్యాదలేంది..? పట్టుకుని జైల్లో వేసి ఉచలు లెక్కపెట్టించాలి. అంతే తప్ప ఫోన్ ట్యాపింగ్‌తో ఒకరు, కాళేశ్వరం  పేరుతో ఇంకొకరు డ్రామాలాడుతూ ప్రజా సమస్యలను దారి మళ్లిస్తున్నరు.. మా ఎజెండా ప్రజా సమస్యలే.. ఈ రెండు పార్టీలకు బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలను కోరుతున్నా.." అని బండి సంజయ్ అన్నారు.

ఎమ్మెల్యేగా పోటీ చేసి ఎంపీగా ఎందుకు పోటీ చేస్తున్నారంటూ వినోద్ కుమర్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ... ‘నా ఇష్టం.. ఎక్కడైనా పోటీ చేయొచ్చు.. ఎమ్మెల్యేగా పోటీ చేస్తా.. ఎంపీగా పోటీ చేసే హక్కు నాకుంది. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా పోటీ చేయొచ్చు. ఆయనెవరు అడగడానికి? దమ్ముంటే స్మార్ట్ సిటీ నిధుల్లో అవకతవకలపై కేసీఆర్ ను ఎందుకు నిలదీయలేదో అపర మేధావి చెప్పాలి..’ ఆయన డిమాండ్ చేశారు. 

Also Read: Glenn Maxwell: ఆర్‌సీబీ విలన్‌గా మారిన మ్యాక్స్‌వెల్.. వరల్డ్ కప్‌లో అలా.. ఐపీఎల్‌లో ఇలా..!

Also Read: Manchu Manoj: తండ్రి అయిన మంచు మనోజ్..పండంటి బిడ్డకు జన్మనిచ్చిన భూమా మౌనిక..

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News