Private travels bus: ఇంట్లోకే దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

Travels bus rammed into house: ఖమ్మం : ఒడిషాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కి వస్తున్న సూపర్ లగ్జరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది.

Last Updated : Sep 12, 2020, 12:57 PM IST
Private travels bus: ఇంట్లోకే దూసుకెళ్లిన ట్రావెల్స్ బస్సు

Travels bus rammed into house: ఖమ్మం : ఒడిషాకు చెందిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఖమ్మం జిల్లాలో బీభత్సం సృష్టించింది. ఒడిషా నుంచి హైదరాబాద్ కి వస్తున్న సూపర్ లగ్జరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు శనివారం తెల్లవారుజామున కూసుమంచి మండలం నాటకన్‌ గూడెంలో రోడ్డుపక్కనే ఉన్న ఓ ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇంట్లో నిద్రిస్తున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. అదృష్టవశాత్తుగా బస్సులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. బస్సు వేగం ధాటికి రెండు ఇండ్లు ధ్వంసమయ్యాయి. Also read : Gold mine collapsed in Congo: బంగారం గనులు కూలి 50 మంది మృతి

ఈ ప్రమాదంలో గాయపడిన వారిని కృష్ణారెడ్డి, ఆయన భార్య వెంకటమ్మగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 20 మంది ప్రయాణికులు ఉన్నారని కూసుమంచి పోలీసులు ( Kusumanchi ) తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తులో బస్సు నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Also read : NTA JEE main result 2020: జేఈఈ ఫలితాలు విడుదల.. తెలంగాణ సత్తా చాటిన టాపర్స్ వీళ్లే

Trending News