ఆ నలుగురు తెలంగాణ భవిష్యత్తు నాశనం చేశారు - రాహుల్

Telangana Elections 2018: కోడంగల్ సభలో కేసీఆర్ కుటుంబంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Last Updated : Nov 28, 2018, 01:45 PM IST
ఆ నలుగురు తెలంగాణ భవిష్యత్తు నాశనం చేశారు - రాహుల్

మహబూబ్ నగర్:  కొండగల్‌ బహిరంగ సభలో  రాహుల్ గాంధీ ఉద్వేగంగా ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ కుటుంబపాలన అంటూ తీవ్ర స్థాయిలో  విరుచుకుపడ్డారు. కోటి ఆశలతో రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆశలను కేసీఆర్ అడిఆశలు చేశారని విమర్శించారు. తెలంగాణ ప్రజలను కలలను సాకారం చేయడంలో కేసీఆర్ విఫలమయ్యారు. తెలంగాణ యువత, రైతలతో పాటు అన్ని వర్గాల వారి కేసీఆర్ పాలనతో విసుగు చెందారని ఆరోపించారు.

తెలంగాణ వస్తే భవిష్యత్తు బాగుందని అనుకున్నాం..కానీ ఇలాంటి పరిస్థితి వస్తుందని అనుకోలేదని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు.. కేసీఆర్ పాలనతో ఆయన కుటుంబ సభ్యులు బంధులుకే మాత్రమే లబ్ది కల్గిందన్నారు. తెలంగాణను ఆ నలుగురు దోచుకున్నారని ... కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ లను ఉద్దేశించి విమర్శించారు. తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ కుటుంబం కోసం కాదన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దోసుకున్న సొమ్ము బయటికి తీసి తెలంగాణ ప్రజలకు పంచుతామని రాహుల్ హామీ ఇచ్చారు. 

Trending News