కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి.

Last Updated : May 29, 2018, 10:53 AM IST
కరీంనగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం

కరీంనగర్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రహదారిపై ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్నాయి. మానకొండూరు మండలం చంజర్ల వద్ద ఈ ప్రమాదం చోటుచేసుకుంది.  ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా, 15 మందికి పైగా గాయాలయ్యాయి. బస్సులో చిక్కుకున్న వారిని పోలీసులు, స్థానికులు కలిసి బయటికి తీసి.. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలిస్తున్నారు.
ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు అందాల్సి ఉంది.

ప్రమాదంపై సీఎం కేసీఆర్ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ప్రాణ నష్టంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారికి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి ఈటల రాజేందర్ ప్రమాద స్థలికి వెళ్లి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.  బాధితులకు మెరుగైన వైద్యం అందిస్తున్నామని.. వారి కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.

Trending News