Sahiti Infratec: హైదరాబాద్‌లో సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాకం..ప్లాట్ల పేరుతో భారీ మోసం..!

Sahiti Infratec: హైదరాబాద్‌లో మరో భారీ మోసం వెలుగు చూసింది. తమకు న్యాయం చేయాలంటూ సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. 

Written by - Alla Swamy | Last Updated : Jul 30, 2022, 02:16 PM IST
  • హైదరాబాద్‌లో మరో భారీ మోసం
  • సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాకం
  • ప్లాట్ల పేరుతో దోపిడీ
Sahiti Infratec: హైదరాబాద్‌లో సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ నిర్వాకం..ప్లాట్ల పేరుతో భారీ మోసం..!

Sahiti Infratec: హైదరాబాద్‌లోని సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ కార్యాలయం వద్ద ఉద్రిక్తత నెలకొంది. తమకు న్యాయం చేయాలంటూ బాధితులంతా బైఠాయించారు. ప్లాట్ల పేరిట భారీ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. అమీన్‌పూర్ వద్ద 23 ఎకరాల్లో సదరు సంస్థ వెంచర్ ఏర్పాటు చేసింది. మొత్తం  4 వేల 3 వందల ప్లాట్లను అందుబాటులో ఉంచింది. 2019 జూన్‌లో ఫ్రీ లాంచ్ కార్యక్రమం ఏర్పాటు చేసింది. ఆ తర్వాత ప్లాట్ల విక్రయాన్ని ప్రారంభించింది.

ఫ్రీలాంచ్‌లో మొత్తం 12 వందల మందికి పైగా కస్టమర్లు ప్లాట్లను కొనుగోలు చేశారు. 2023 మార్చి నాటికి ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి అప్పగిస్తామని సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ హామీనిచ్చింది. ఐతే ఇప్పటివరకు ఆ సంస్థ ఎలాంటి నిర్మాణాలను చేపట్టలేదు. కేవలం స్థలంలో చదును మాత్రమే చేసింది. తమ ప్లాట్లను అప్పగించమని అడిగితే బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. డబుల్‌ బెడ్‌రూమ్‌కు రూ.25 లక్షలు, ట్రిబుల్ బెడ్‌రూమ్‌కు రూ.35 లక్షలు వసూలు చేసినట్లు చెబుతున్నారు. 

ప్లాట్లకు మొత్తం ఒకేసారి డబ్బు మొత్తం చెల్లించామని బాధితులు అంటున్నారు. మొత్తం 2 వేల మంది బాధితులు రూ.15 వందల కోట్ల వరకు చెల్లించినట్లు తెలుస్తోంది. కట్టిన డబ్బులు అడిగితే సాహితి ఇన్‌ఫ్రాటెక్‌ ఎండీ లక్ష్మీనారాయణ బెదిరింపులకు పాల్పడుతున్నారని..కార్యాలయం ముందు బాధితులంతా బైఠాయించారు. తమకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. ఫ్రీలాంచ్ సమయంలో ఎనిమిది టవర్లు చెప్పారని గుర్తు చేస్తున్నారు.

ఆ తర్వాత మరో 10 టవర్లు అని మభ్య పెట్టారని..ఎప్పటికప్పుడు ప్లాన్లు మారుస్తూ వచ్చారని మండిపడుతున్నారు. కొంత మంది అగ్రిమెంట్ క్యాన్సిల్ చేసుకుంటే వారికి కూడా అరకొర డబ్బులు ఇచ్చారని చెబుతున్నారు. తాము తీసుకున్న ప్లాట్లను ఇతరులకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వస్తున్నాయని..అందుకే న్యాయం కోసం రోడ్డు ఎక్కామని వాపోతున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని బాధితులు అంటున్నారు. 

Also read:IND vs WI: కరేబియన్ గడ్డపై టీమిండియా సూపర్ షో..తొలి టీ20లో ఘన విజయం..!

Also read:Rain Alert: తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్..అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ..!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x