Rakhi Tragedy: కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.. రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన యువతి.. అసలేం జరిగిందంటే..?

Raksha bandhan 2024: రాఖీ పండగ వేళ కన్నీళ్లు తెప్పించే ఘటన చోటు చేసుకుంది.  మహబూబాబాద్ జిల్లాలో జరిగిన ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీన్ని చూసిన నెటిజన్ లు నిందితులకు కఠినంగా పనిష్మెంట్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నారు.

Written by - Inamdar Paresh | Last Updated : Aug 19, 2024, 02:43 PM IST
  • రాఖీ పండుగ వేళ విషాదం..
  • సోదరులకు రాఖీ కట్టి చనిపోయిన యువతి..
Rakhi Tragedy: కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో.. రాఖీ కట్టి తుదిశ్వాస విడిచిన యువతి.. అసలేం జరిగిందంటే..?

Sister dies after tying rakhi to brothers hand in mahabubabad: మహిళలు, అమ్మాయిల భద్రత ప్రస్తుతం ఆందోళన కల్గించే అంశంగా మారింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతిరోజు మహిళలపై అత్యాచారాలు, దాడుల ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. కామాంధుల, పసిపాపల నుంచి పండు ముసలి వరకు ఎవర్ని వదలడం లేదు. మరికొందరు మాత్రం వివి వరసలు మర్చిపోయి అత్యాచారాలకు పాల్పడుతున్నారు. బస్టాండ్, రైల్వేస్టేషన్, గుడి, బడి, ఆఫీసు ఇలా ప్రతిచోటు మహిళలు వేధింపులకు గురౌతున్నారు.

 

 

కొన్ని చోట్ల తోబుట్టువులు, కంటికి రెప్పలా కాపాడాల్సిన వారు సైతం అత్యాచారాలకుపాల్పడుతున్నారు. ఈ నేపథ్యంతో ఒక యువతికి ఆకతాయిల వేధింపులు ఎక్కువయ్యాయి. ప్రతిరోజు ఆమెను ప్రేమపేరుతో వేధింపులకు గురిచేస్తుండటంతో.. ఆమె తన వాళ్లకు చెప్పలేక.. గడ్డి మందు తాగింది. ఈ ఘటన మహబూబాబాద్ లో చోటు చేసుకుంది.

పూర్తివివరాలు..

మహబూబాబాద్ జిల్లాలో విషాదర సంఘటన చోటు చేసుకుంది. ఒక నర్సింహుల పేట మండలంలోనియువతి ప్రతిరోజు కోదాడకు వెళ్తుండేది. ఆమెను కొంత మంది ఆకతాయిలు వేధించేవారు. ప్రతిరోజు కాలేజీకి వెళ్తుండగా.. ఆమెవెనుకపడి ఇబ్బందులకు గురిచేసేవారు. ఇదిలా ఉండగా.. సదరు యువతి వేధింపులకు తాళలేక పొలంలోకి వెళ్లిగడ్డి మందు తాగింది. దీంతో ఆమెను హుటా హుటీన ఆస్పత్రికి తరలించారు. కానీ ఆమెశరీరంలో అప్పటికే విషపు గుళికలు పలు అవయవ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు వైద్యులు తెలిపారు. దీంతో సదరు యువతకి ఒక తమ్ముడు ఉన్నారు.

ఆసుపత్రిలో కొన ఊపిరితో ఉన్న యువతి.. రాఖీ పండగ నాటికి ప్రాణాలతో ఉంటానో లేదోనని బాధపింది. ఈ నేపథ్యంలో.... శనివారం రాత్రే సోదరులకు రాఖీ కట్టింది. రాఖీ కట్టిన కేవలం కొన్ని గంటల్లోనే ప్రాణం వదిలింది. ఈఘటనతో ఒక్కసారిగా కుటుంబంతో పాటు.. గ్రామస్థులు సైతం కన్నీళ్లు పెట్టుకున్నారు. దీంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. రాఖీ పండగ సమయంలోనే తమ సోదరి చనిపోవడంతో.. ఆమె సొదరులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

Read more: Amrapali: హైదరాబాద్ వాసులకు బిగ్ రిలీఫ్.. కుక్కల బెడదపై గుడ్ న్యూస్ చెప్పిన ఆమ్రాపాలీ..

ప్రేమ పేరుతో వేధించి,  సోదరి మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనికూడా డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రంగంలోకి దిగిన  నర్సింహులపేట పోలీసులు కేసు నమోదు చేశారు. అతనిపై ఎస్సీ ఎస్టీ, పొక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. వేధింపులకు గురి చేసిన ఆకతాయి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రస్తుతం రాఖీ పండుగల వేళ యువతి, తన సోదరుడికి రాఖీ కట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.   

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

 Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News