Teegala VS Sabitha: టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ లోకి జంప్?

Teegala VS Sabitha: రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు.

Written by - Srisailam | Last Updated : Jul 5, 2022, 11:49 AM IST
  • మహేశ్వరం టీఆర్ఎస్ లో వర్గ పోరు
  • మంత్రి సబిత కబ్జా కోరు- తీగల
  • టీఆర్ఎస్ కు రాజీనామా యోచనలో తీగల
Teegala VS Sabitha: టీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్.. మంత్రి సబితపై తీగల డైరెక్ట్ అటాక్.. కాంగ్రెస్ లోకి జంప్?

Teegala VS Sabitha: రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ లో వర్గ పోరు భగ్గుమంది. కొంతకాలంగా నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతి రోడ్డెక్కింది. మహేశ్వరం నియోజకవర్గం మాజీ ఎమ్యెల్యే తీగల కృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డిపై డైరెక్ట్ అటాక్ కు దిగారు. మంత్రి సబితను కబ్జా కోరని ఆరోపించారు. మీరుపేటను నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. అక్రమాలను చూస్తు ఊరుకోనని.. ఆమరణ నిరాహారదీక్ష చేస్తానని ప్రకటించారు. మహేశ్వరం నియోజకవర్గంలో భూ కబ్జాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రోత్సహిస్తున్నారని తీగల ఆరోపించారు. ప్రభుత్వ భూములను స్వాహా చేస్తున్నారని అన్నారు. చెరువులు, స్కూల్ జాగాలను వదలడం లేదంటూ తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ట్రంక్ లైన్ పనులు ఇంకా పూర్తి చేయలేదన్నారు. టీఆర్ఎస్ పార్టీ నుంచి సబిత గెలవలేదన్న తీగల కృష్ణారెడ్డి.. మంత్రి అవినీతికి సంబంధించిన పూర్తి వివరాలను సీఎం కేసీఆర్ కు అందిస్తానని చెప్పారు. సబితతో తాడో పేడో తేల్చుకుంటానని తీగల కృష్ణారెడ్డి హెచ్చరించారు.

మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబిత,  మాజీ ఎమ్మె్ల్యే తీగల కృష్ణారెడ్డి మధ్య కొంత కాలంగా విభేదాలు ఉన్నాయి. 2014లో టీడీపీ నుంచి మహేశ్వరం ఎమ్మెల్యేగా గెలిచారు తీగల కృష్ణారెడ్డి. తర్వాత అధికార టీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018 ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన తీగల.. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన సబితా ఇంద్రారెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే 2019లో సబిత టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తర్వాత మంత్రి అయ్యారు. సబిత కారెక్కినప్పటి నుంచి తీగలతో ఆమెకు విభేదాలు వచ్చాయి. మహేశ్వరం నియోజకవర్గంలో సబిత, తీగల మధ్య ఆధిపత్య పోరు సాగుతోంది. మొదటి నుంచి టీఆర్ఎస్ లో ఉన్న నేతలను పట్టించుకోకుండా.. కాంగ్రెస్ నుంచి తనతో వచ్చిన వాళ్లకే సబిత ప్రాధాన్యతగతంలో చాలా సార్లు సబిత తీరుపై ఓపెన్ గానే విమర్శలు చేశారు తీగల. దీంతో తీగల పార్టీ మారుతారనే ప్రచారం సాగుతోంది. కాని తీగల మాత్రం ఖండిస్తూ వస్తున్నారు.

మహేశ్వరం నియోజకవర్గంలో కొన్ని రోజులు రాజకీయ సమీకరణలు మారిపోతున్నాయి. బడంగ్ పేట కార్పొరేషన్ మేయర్ పారిజాత నర్సింహరెడ్డి అధికార పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరారు. ఢిల్లీలో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో కలిసి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మంత్రి సబిత వ్యవహార శైలి వల్లే మేయర్ పార్టీ మారారనే టాక్ వస్తోంది. బడంగ్ పేట మేయర్ రాజీనామా చేసిన మరుసటి రోజే మంత్రి సబితను తీగల కృష్ణారెడ్డి టార్గెట్ చేయడం కలకలం రేపుతోంది. తీగల కూడా పార్టీ మారాలని డిసైడ్ అయ్యారని అంటున్నారు. తీగలతో రేవంత్ రెడ్డి మాట్లాడారని.. ఈనెల 11న కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది.

Read also: CM KCR: మోడీ, షా దెబ్బకు టీఆర్ఎస్ షేక్.. ఈటలతో టచ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు?

Read also: Corona cases in India: నిన్నటి కంటే భారీగా తగ్గిన కొవిడ్ కేసులు.. కొత్తగా ఎన్ని వచ్చాయంటే?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి. Twitter , Facebook

Trending News