అసెంబ్లీ స్పీకర్‌కు హై కోర్టు నోటీసులు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌కు హైకోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే.

Last Updated : Jun 12, 2019, 12:35 PM IST
అసెంబ్లీ స్పీకర్‌కు హై కోర్టు నోటీసులు

అమరావతి : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌‌కు హైకోర్టు బుధవారం మరోసారి నోటీసులు జారీచేసింది. టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనాన్ని సవాల్‌ చేస్తూ.. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నేడు ఈ పిటిషన్‌ విచారణకు వచ్చిన సందర్భంగా అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్ రెడ్డితోపాటు అసెంబ్లీ కార్యదర్శి నర్సింహా చార్యులు, ఎన్నికల కమిషన్‌, పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 

ఏ ప్రాతిపదికన సీఎల్పీ విలీనాన్ని చేపట్టారో తెలియజేయాల్సిందిగా కోర్టు ఈ ఆదేశాల్లో పేర్కొన్నట్టు తెలుస్తోంది.

Trending News