Telangana COVID-19 Updates: ఒక్కరోజులో 56 కరోనా మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు

Telangana COVID-19 Positive Cases : ఏప్రిల్ ప్రారంభం నుంచి కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,061 మంది కరోనా బారిన పడ్డారు.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 28, 2021, 10:55 AM IST
Telangana COVID-19 Updates: ఒక్కరోజులో 56 కరోనా మరణాలు, నైట్ కర్ఫూలో పెరిగిన కేసులు

కరోనా వైరస్ సెకండ్ వేవ్‌ ప్రభావం తెలంగాణలోనూ అధికంగా ఉంది. ఏప్రిల్ ప్రారంభం నుంచి కరోనా కేసులు, కోవిడ్19 మరణాలు భారీగా పెరిగిపోతున్నాయి. నైట్ కర్ఫ్యూ అమలవుతున్నా కరోనా కేసులు తగ్గకపోగా, భారీ కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రాష్ట్రంలో తాజాగా 8,061 మంది కరోనా బారిన పడ్డారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య(Telangana CoronaVirus Cases) 4,19,966కి చేరింది. ఈ మేరకు తెలంగాణ వైద్య,ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం కరోనా బులెటిన్ విడుదల చేసింది.

రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం రాత్రి 8 గంటల నుంచి మంగళవారం రాత్రి 8 వరకు గడిచిన 24 గంటల్లో 82,270 శాంపిల్స్‌కు కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. అందులో 8 వేల 61 మందికి కోవిడ్19 పాజిటివ్‌గా నిర్ధారించారు. తాజా కేసులతో కలిపి తెలంగాణలో నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4 లక్షల 19 వేల 9 వందల 66కు చేరింది. కరోనా బారిన పడి రాష్ట్రంలో కొత్తగా 56 మంది మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా మరణాలతో కలిపి తెలంగాణలో మొత్తం కరోనా మరణాలు 2,150కి చేరింది. నిన్నటితో పోల్చితే తక్కువ శాంపిల్స్‌కు టెస్టులు చేయడంతో నేడు కరోనా(COVID-19) పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి.

Also Read: Pulse Oximeter: పల్స్ ఆక్సీమీటర్ అంటే ఏమిటి, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలుసా

జీహెచ్ఎంసీలో అత్యధిక కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. తాజా కేసులలో GHMC పరిధిలో 1,508 కరోనా కేసులు నమోదు కావడంతో హైదరాబాద్ మహా నగర ప్రజలలో ఆందోళన నెలకొంది. తెలంగాణలో ప్రస్తుతం 72 వేల 133 యాక్టివ్ కేసులు ఉన్నాయి. తెలంగాణలో ఇప్పటివరకూ 1.27 కోట్ల శాంపిల్స్‌కు కరోనా(CoronaVirus) నిర్ధారణ పరీక్షలు చేసినట్లు హెల్త్ బులెటిన్‌లో వెల్లడించారు. ప్రతి 10 లక్షల మందిలో 3.5 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు తాజా ప్రకటనలో తెలిపారు. 

Also Read: New COVID-19 Guidelines: మే 1 నుంచి మూడో దశలో కరోనా వ్యాక్సినేషన్, కేంద్రం మార్గదర్శకాలివే

భౌతిక దూరం పాటించాలని, అవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లకూడదని వైద్య శాఖ, వైద్యులు, ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మే 1వ తేదీ నుంచి 18 ఏళ్లు పైబడిన అందరికీ ఉచితంగా కరోనా టీకాలు ఇవ్వనున్నారు. ఈ క్రమంలో 45 ఏళ్లు పైబడిన వారు అప్పటిలోగా టీకాలు తీసుకునేందుకు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ప్రజల నిర్లక్ష్యం కారణంగానే కరోనా కేసులు వేగంగా వ్యాప్తి చెందుతున్నాయని అధికారులు, వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News