ఖమ్మం సీటు హామీతో టీఆర్‌ఎస్‌లో చేరిన  నామా నాగేశ్వరరావు

                                  

Last Updated : Mar 21, 2019, 04:45 PM IST
ఖమ్మం సీటు హామీతో టీఆర్‌ఎస్‌లో చేరిన  నామా నాగేశ్వరరావు

తెలంగాణ టీడీపీ సీనియర్ నేత నామా నాగేశ్వరరావు టీఆర్ఎస్ గూటికి చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో గురువారం ఆయన పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. ఖమ్మం లోక్ సభ సీటు ఇస్తానని కేసీఆర్ హామీ ఇవ్వడంతో నామా నాగేశ్వరావు టీఆర్ఎస్ గూటికి చేరినట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే ఆరుగురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తనవైపు తిప్పకున్న కేసీఆర్..తెలంగాణ టీడీపీకి కీలక నేతగా ఉన్న నామా నాగేశ్వరావును కూడా వలవేసి తన తన పార్టీలో చేర్చుకున్నారు.

కారణం ఇదే...

గత ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ ఘన విజయం సాధించినప్పటికీ.. ఖమ్మం జిల్లాలో మాత్రం కేవలం ఒక్క సీటుకే పరిమితమైంది. ఈ క్రమంలో ఖమ్మం లోక్ సభ సెగ్మెంట్ లో పార్టీ బలహీనంగా ఉందని కేసీఆర్ గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ జిల్లాలో పార్టీలోని బలోపేతం చేసుకునే క్రమంలో జనాల్లో మంచి గుర్తింపు ఉన్న నామాను టీఆర్ఎస్ లో చేర్చుకున్నట్లు రాజకీయవర్గాలు పేర్కొంటున్నాయి. 

Trending News