కాచిగూడలో రైలు ప్రమాదం.. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన లోకో పైలట్

కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం... ఆగివున్న ఇంటర్ సిటీ రైలును ఢీకొట్టిన ఎంఎంటిఎస్ రైలు

Last Updated : Nov 11, 2019, 03:47 PM IST
కాచిగూడలో రైలు ప్రమాదం.. క్యాబిన్‌లో చిక్కుకుపోయిన లోకో పైలట్

హైదరాబాద్: కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగివున్న ఇంటర్ సిటీ రైలును ముందు వైపు నుంచి వచ్చిన కర్నూలు సిటీ-సికింద్రాబాద్ హంద్రీ ఎక్స్‌ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మూడు బోగీలు పట్టాలు తప్పగా మరో ఆరు బోగీలు పట్టాలపై పడిపోయాయి. 

ఈ దుర్ఘటనలో 30 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు. ఎంఎంటిఎస్ రైలు లోకోపైలట్ శేఖర్ ఇంజన్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోవడంతో అతడిని రక్షించేందుకు రైల్వే అధికారులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. జీహెచ్ఎంసికి చెందిన డీఆర్ఎఫ్ బృందాలు సైతం కాచిగూడ రైల్వే స్టేషన్‌కి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయి. 

సిగ్నల్ చూసుకోకుండా రెండు రైళ్లు ఒకే ట్రాక్ పైకి రావడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించిన రైల్వే అధికారులు.. తక్షణమే సహాయ కార్యక్రమాలు చేపట్టారు.

Trending News