కేసీఆర్‌పై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తా : వంటేరు ప్రతాప్‌ రెడ్డి

కేసీఆర్‌పై గెలుపు నాదే అంటున్న వంటేరు ప్రతాప్ రెడ్డి

Last Updated : Dec 9, 2018, 11:13 AM IST
కేసీఆర్‌పై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తా : వంటేరు ప్రతాప్‌ రెడ్డి

హైదరాబాద్: గజ్వెల్ ఎన్నికల రణరంగంలో గెలుపు నాదే అని ధీమా వ్యక్తంచేస్తున్నారు అక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసిన వంటేరు ప్రతాప్‌ రెడ్డి. అంతేకాకుండా తెలంగాణ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, గజ్వెల్ టీఆర్ఎస్ అభ్యర్థి అయిన కేసీఆర్‌పై 50 వేల ఓట్ల మెజార్టీతో గెలిచి తీరుతానని ఆయన ప్రకటించుకున్నారు. శుక్రవారం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇవాళ మీడియాతో మాట్లాడుతూ వంటేరు ప్రతాప్‌ రెడ్డి ఈ ప్రకటన చేశారు. ఎంతో మంది త్యాగాల ఫలితంగా పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని కేసీఆర్ కూనీ చేశారని వంటేరు ఆరోపించారు. తెలంగాణకు అసలు నిజమైన స్వాతంత్ర్యం ఈనెల 11తేదిన వస్తుందని వంటేరు అభిప్రాయపడ్డారు. 

ఇదిలావుంటే, ఓట్ల లెక్కింపు విధానం విషయంలో హైకోర్టుకు వెళ్లే ఆలోచనలో వున్నట్టు ఈ సందర్భంగా వంటేరు ప్రతాప్ రెడ్డి మీడియాకు తెలిపారు.

Trending News