ఏపీలో మరో 58 మందికి కరోనా.. 3 జిల్లాల్లో భారీగా కేసులు

కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జరిపిన కోవిడ్19 టెస్టుల్లో 58 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.

Last Updated : May 3, 2020, 06:04 PM IST
ఏపీలో మరో 58 మందికి కరోనా.. 3 జిల్లాల్లో భారీగా కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. గడిచిన 24 గంటల్లో జరిపిన కోవిడ్19 టెస్టుల్లో 58 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,583కు చేరుకుంది. చికిత్స అనంతరం కోలుకుని ఇప్పటివరకూ 488 మంది డిశ్ఛార్జ్ కాగా, 33 మంది మరణించారు. ప్రస్తుతం 1062 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.  ఈ విషయాలు తెలిస్తే మీరూ బ్లడ్ డొనేట్ చేస్తారు

కర్నూలు జిల్లాలో కరోనా ఉగ్రరూపం దాల్చుతోంది. ఆ జిల్లాలో 450కి పైగా కేసులు నమోదు కావడం గమనార్హం. కర్నూలు జిల్లాలో ఏకంగా 466 కేసులు నమోదుయ్యాయి. గుంటూరు జిల్లాలో 319 కరోనా కేసులు, కృష్ణా జిల్లా 266 కేసులతో కరోనా తీవ్రతను ఎదుర్కొంటున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా కర్నూలు జిల్లాలో 30 పాజిటివ్ కేసులు నమోదు కాగా, గుంటూరు జిల్లాలో 11, కృష్ణా జిల్లాలో 8, అనంతపురం జిల్లాలో 7, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో ఒక్క కేసు చొప్పున నమోదయ్యాయి.  బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!

Image Credit: twitter/@ArogyaAndhra

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 
Photos: కేఎల్ రాహుల్, అతియా శెట్టి క్రేజీగా! 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

Trending News