AP: రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయమైంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి.

Last Updated : Jul 21, 2020, 11:30 AM IST
AP: రేపు మధ్యాహ్నం కేబినెట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణకు నిర్ణయమైంది. బుధవారం మధ్యాహ్నం 1 గంట 29 నిమిషాల ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకట రమణలు మంత్రి పదవులకు రాజీనామా చేసిన నేపధ్యంలో రెండు బెర్త్ లు ఖాళీ అయ్యాయి. ఈ రెండు ఖాళీల్ని భర్తీ చేయడానికి ముఖ్యమంత్రి వైెఎస్ జగన్ నిర్ణయించుకున్నారు. రాజ్యసభకు ఎన్నికైన ఇద్దరి రాజీనామాల్ని గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఇప్పటికే ఆమోదించారు. రేపు కేబినెట్ విస్తరణలో కొత్త మంత్రులతో గవర్నర్ ప్రమాణం చేయించనున్నారు. 

రెండు బెర్త్ ల  భర్తీకోసం ఆశావహులు చాలామంది ఉన్నారు. ఖాళీ అయిన రెండు స్థానాలు బీసీ సామాజికవర్గానికి చెందినవి కావడంతో...అదే సామాజికవర్గంతో భర్తీ చేస్తారని భావిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎవరికి అవకాశం దక్కుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. Also read: AP: త్వరలో ఏపీ కేబినెట్ విస్తరణ, కార్పొరేషన్ కొలువుల పందేరం

Trending News