APPSC Group 1 Mains Exam 2020 Date: ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలివే

APPSC Group 1 Mains Exam 2020 Date: ఏపీ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు (AP Group-1 Mains Exam) ఇటీవల ఖరారైంది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని కమిషన్ సభ్యులు సూచించారు.

Last Updated : Dec 13, 2020, 10:22 AM IST
  • డిసెంబర్ 14 నుంచి గ్రూప్1 పరీక్షలు
  • హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకున్నారా
  • ఉదయం 10గంటల నుంచి పరీక్ష
APPSC Group 1 Mains Exam 2020 Date: ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల తేదీలివే

APPSC Group 1 Mains Exam 2020 Date: ఆంధ్రప్రదేశ్ గ్రూప్‌-1 మెయిన్స్ పరీక్షల షెడ్యూలు (AP Group-1 Mains Exam) ఇటీవల ఖరారైంది. డిసెంబర్‌ 14 నుంచి 20వ తేదీ వరకు ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) స్పష్టం చేసింది. మొత్తం 9,679 మంది అభ్యర్థులు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరుకానున్నారు. కాగా, నవంబర్‌ 2 నుంచి 13 వరకు జరగాల్సిన ఏపీ గ్రూప్ 1 మెయిన్స్‌ పరీక్షలను ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు ఏపీపీఎస్సీ ఇటీవల వాయిదా వేయడం తెలిసిందే. 

ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1వరకు గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష జరుగుతుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 అభ్యర్థులు పరీక్షకు హాల్ టికెట్‌తో పాటు ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు తీసుకుని రావాలని సూచించారు. పరీక్షకు సంబంధించి ఏవైనా సందేహాలు, ఫిర్యాదులు ఉంటే 0866-252-7820, 0866-252-7821, 0866-252-7819 నంబర్లలో సంప్రదించాలని అభ్యర్థులకు తెలిపారు. కరోనా వైరస్ నేపథ్యంలో జరుగుతున్న పరీక్షలు కనుక, గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా కోవిడ్-19 నిబంధనలు పాటించాలని ఏపీపీఎస్సీ సభ్యులు సూచించారు.

Also Read: Jobs 2020: కేంద్ర ప్రభుత్వ సంస్థలో 510 ఉద్యోగాలు

APPSC Group 1 Mains Exam 2020 Schedule

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను డిసెంబర్‌ 14 నుంచి 20 వరకు నిర్వహించేందుకు ఏపీలోని అన్ని జిల్లాలతో పాటు హైదరాబాద్‌లోనూ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ నుంచి గ్రూప్ 1 మెయిన్స్ హాట్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించింది. ఏపీపీఎస్సీ (APPSC) అధికారిక వెబ్‌సైట్‌ https://psc.ap.gov.in/లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంచింది. 

Also Read: ECIL Recruitment 2020: మేనేజర్ పోస్టులకు ఈసీఐఎల్ నోటిఫికేషన్, పూర్తి వివరాలు

కాగా, ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 169 గ్రూప్ 1 పోస్టులకు గతేడాది స్క్రీనింగ్ టెస్ట్‌ను ఏపీపీఎస్సీ నిర్వహించడం తెలిసిందే. తొలి కీ తర్వాత మెయిన్స్‌ పరీక్షకు 1:50 ప్రకారం అభ్యర్థులను ఎంపిక చేసింది. కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించడంతో మెయిన్స్ పరీక్షలు కొన్ని రోజులు వాయిదా పడ్డాయి. తాజా నిర్ణయంతో ఏపీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అభ్యర్థులు సిద్ధమవుతున్నారు.  

Also Read: Solar Eclipse 2020 Date and Timings: ఈ ఏడాది చివరి సూర్యగ్రహణం ఎప్పుడు.. భారత్‌లో పరిస్థితి ఏంటంటే! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

  • మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook 

 

Trending News