Godavari: వంతెనను ఢీ కొని ముక్కలైన లాంచీ..ముగ్గురి గల్లంతు

గోదావరి ఉపనది శబరిలో ప్రమాదం చోటుచేసుకుంది. వరద ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు. శబరి నదీ ప్రవాహంలో ఓ లాంచీ ..వంతెనను ఢీ కొట్టడంతో రెండు ముక్కలైపోయింది. లాంచీలో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు

Last Updated : Aug 20, 2020, 09:00 PM IST
Godavari: వంతెనను ఢీ కొని ముక్కలైన లాంచీ..ముగ్గురి గల్లంతు

గోదావరి  ( Godavari ) ఉపనది శబరి ( Sabari river ) లో ప్రమాదం చోటుచేసుకుంది. వరద ఉధృతిలో ముగ్గురు గల్లంతయ్యారు. శబరి నదీ ప్రవాహంలో ఓ లాంచీ ..వంతెనను ఢీ కొట్టడంతో రెండు ముక్కలైపోయింది. లాంచీలో ప్రయాణిస్తున్న ముగ్గురు గల్లంతయ్యారు. తూర్పు గోదావరి జిల్లా చింతూరు ( Chinthoor ) వద్ద శబరి నదీ ప్రవాహంలో ఈ ప్రమాదం జరిగింది. వరద బాధితులకు నిత్యావసర వస్తువుల్ని అందించి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో లాంచీలో ఉన్న ముగ్గురు గల్లంతయ్యారు.  ఏజీ కోడేరుకు వెళ్లి వస్తుండగా...వరద ఉధృతికి లాంచీ బ్యాలెన్స్ తప్పి శబరి వంతెన పిల్లర్ ను బలంగా ఢీ కొంది. దాంతో లాంచీ బ్రేక్ అవడంతో...అందులో ప్రయాణీస్తున్న ముగ్గురు వరదలో కొట్టుకుపోయారు. ఘటనా స్థలానిక ిచేరుకున్న అధికార్లు, రక్షణ బృందాలు సహాయక చర్యలు ప్రారంభించారు. Also read: Swachh Survekshan 2020: ఏపీకు అవార్డులు, ర్యాంకుల మోత

Trending News