'భరత్ అను నేను' సినిమాపై ఫిర్యాదు

'భరత్ అను నేను' సినిమాపై ఫిర్యాదు

Last Updated : Jun 5, 2018, 10:46 AM IST
'భరత్ అను నేను' సినిమాపై ఫిర్యాదు

మహేష్‌ బాబు-కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘భరత్‌ అనే నేను’ సినిమాలో ‘నవోదయం పార్టీ’పై దుష్ప్రచారం చేశారని ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు ఆరోపించారు. ఈ మేరకు గుంటూరు జిల్లా అర్బన్‌ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆయన  ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీ 2010లో స్థాపితమైందని, భారత ఎన్నికల సంఘంతో రిజిస్ట్రేషన్‌ కూడా చేయించినట్లు ఆయన తెలిపారు. మీడియాతో మాట్లాడిన ఆయన.. తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా సినిమాలో చూపించారని అన్నారు.

నవోదయం పార్టీ పేరును సినిమాలో అనేకసార్లు చూపిస్తూ అప్రజాస్వామికమైన పదజాలం వాడారని, తమ పార్టీ లక్ష్యాలకు విరుద్ధంగా సన్నివేశాల్లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరానని చెప్పారు.

Trending News