9వ తరగతి విద్యార్థిని ప్రసవం.. కడుపులోనే శిశువు మృతి!

ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక శనివారం తెల్లవారుజామున ఓ మృత శిశువును ప్రసవించింది.

Last Updated : Aug 18, 2018, 08:21 PM IST
9వ తరగతి విద్యార్థిని ప్రసవం.. కడుపులోనే శిశువు మృతి!

ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రంలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కేంద్రంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న ఓ మైనర్ బాలిక శనివారం తెల్లవారుజామున ఓ మృత శిశువును ప్రసవించింది. అనంతపురం డీఎస్పీ వెంకట్రావు తెలిపిన వివరాల మేరకు.. 14 ఏళ్ల మైనర్ బాలిక శుక్రవారం రాత్రి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతుండటంతో బాధితురాలి తండ్రి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ బాలికకు పలు వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు ఆమె కడుపులో బిడ్డ ఉన్నట్టు గుర్తించారు. శనివారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో బాలికకు శస్త్రచికిత్స నిర్వహించి ఆమె కడుపులోంచి శిశువును వెలికి తీశారు. అయితే, అప్పటికే ఆ శిశువు మృతి చెంది ఉందని వైద్యులు తెలిపారు. 

9వ తరగతి బాలిక మృత శిశువును ప్రసవించిందనే ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అభంశుభం తెలియని మైనర్ బాలికను మోసం చేసి ఈ దారుణానికి ఒడిగట్టిన నిందితుడు ఎవరనే కోణంలో ప్రస్తుతం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Trending News