కృష్ణా జిల్లాలో దారుణం: మూడేళ్ల బాలుడిపై ఆయా పైశాచికం..

కృష్ణా జిల్లా భూషణగుళ్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది.

Last Updated : Jul 10, 2018, 12:19 PM IST
కృష్ణా జిల్లాలో దారుణం: మూడేళ్ల బాలుడిపై ఆయా పైశాచికం..

కృష్ణా జిల్లా భూషణగుళ్ల గ్రామంలోని అంగన్‌వాడీ కేంద్రంలో దారుణం జరిగింది.  అంగన్‌వాడీ కేంద్రం ఆయా మూడేళ్ళ బాలుడిపై పైశాచికంగా వ్యవహరించింది. వివరాల్లోకి వెళితే సోమవారం మూడేళ్ల బాలుడిని తల్లి అంగన్‌వాడీ కేంద్రంలో దించడానికి తీసుకెళ్తే.. తాను రానంటూ ఏడుపు మొదలుపెట్టాడు. అయినా చిన్నారిని బుజ్జగించి కేంద్రంలో వదిలి వెళ్లింది ఆ తల్లి. ఎంతసేపటికీ ఏడుపు ఆపకపోవడంతో ఆయా బాలుడు వేలికి కారం పూసి నోట్లో పెట్టింది. దీంతో ఆ బాలుడు బాగా ఏడ్చాడు. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు అంగన్‌వాడీ కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ఆయాపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఆయాపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అధికారులు హామీ ఇవ్వడంతో తల్లిదండ్రులు, స్థానికులు ఆందోళన విరమించారు.

చిన్నారిపై జరిగిన దారుణ ఘటనపై సీరియస్‌ అయిన అధికారులు బాధ్యులపై సస్పెన్షన్‌ వేటు వేశారు. అంగన్‌వాడీ కేంద్రంలో పని చేస్తున్న ఆయా, టీచర్‌ని అధికారులు సస్పెండ్‌ చేశారని తెలిసింది.

Trending News