తిరుమల తిరుపతికి మంచి రోజులొస్తున్నాయా..?

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పాలకమండలి భేటీ ముగిసిన క్రమంలో.. మండలి తీసుకున్న పలు నిర్ణయాలు బాగున్నాయని పలువురు అంటున్నారు.

Last Updated : Oct 9, 2018, 10:04 PM IST
తిరుమల తిరుపతికి మంచి రోజులొస్తున్నాయా..?

తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన పాలకమండలి భేటీ ముగిసిన క్రమంలో.. మండలి తీసుకున్న పలు నిర్ణయాలు బాగున్నాయని పలువురు అంటున్నారు. దేవస్థానం ఛైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్, ఈవో అనిల్ సింఘాల్ ఈ భేటీ తర్వాత టీటీడీ ఉద్యోగులను కలిసి మాట్లాడారు. వారి సూచనలు కూడా తమకు అవసరమేనని.. ఎలాంటి సమస్య ఉన్నా చెబితే పరిష్కరిస్తామని తెలియజేశారు. తాజాగా పాలకమండలి కూడా పలు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని వారు తెలిపారు. ఆ నిర్ణయాల్లో ప్రముఖమైనవి ఇవే.
*అలిపిరి ప్రాంతంలో భక్తుల కోసం 500 గదులతో కాంప్లెక్స్ నిర్మించాలని మండలి భావించింది. అందుకోసం రూ.120 కోట్లు వెచ్చించనున్నట్లు తెలిపింది.
*ఒకే విభాగంలో మూడు సంవత్సరాల సర్వీసు ఉన్న ఉద్యోగులను.. ఖాళీలను బట్టి వేరే విభాగాలకు కూడా బదిలీ చేస్తామని కూడా మండలి తెలిపింది.
*పరకామణి (హుండీలో నాణెములు మరియు సమర్పణలు లెక్కింపు ప్రక్రియ) డిప్యూటేషన్‌ విధులను కూడా రద్దు చేసేందుకు పాలకమండలి ఆమోదం తెలిపింది. 
*తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహించే పాఠశాలలు, కళాశాలలలో డిమాండ్ ఉన్న గ్రూపులకు సంబంధించి సీట్ల సంఖ్యను పెంచుతున్నట్లు కూడా పాలకమండలి తెలిపింది.
*అదే విధంగా జీవో నెంబరు 90ను అమలు చేయాలని భావిస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి తెలిపింది. ఈ జీవో ప్రకారం తితిదే విద్యాసంస్థల్లో బోధించే అధ్యాపకులు పదవీ విరమణ చేశాక.. ఆర్జిత సెలవులు, అర్థ వేతనల సెలవులకు సంబంధించిన నగదు మార్పిడి విధానాన్ని అమలు చేయనున్నట్లు మండలి తెలిపింది.
*తితిదేలో రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలను కూడా పరిష్కరించడానికి తాము ముందుంటామని మండలి తెలిపింది. అందుకోసం ఒక కమిటీని ఇకపై నిర్వహించేందుకు తాము శ్రీకారం చుడుతున్నట్లు మండలి అధికారులు తెలిపారు.
*అలాగే తిరుమలలో వసతి గృహాలను ఆధునీకరించాలని మండలి భావిస్తోంది. అందుకోసం రూ.112 కోట్లను ఖర్చు చేయనున్నట్లు తెలిపింది.

Trending News