తిరుపతిలో కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ

తిరుపతిలో తన కోసం వేచిచూసిన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు.

Last Updated : Jun 9, 2019, 06:24 PM IST
తిరుపతిలో కార్యకర్తలకు క్షమాపణలు చెప్పిన ప్రధాని మోదీ

తిరుపతిలో తన కోసం వేచిచూసిన పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు ప్రధాని నరేంద్ర మోదీ క్షమాపణలు చెప్పారు. శ్రీలంకలో తన కార్యక్రమం ముగించుకోవడంలో కొంత ఆలస్యమైందని, ఆ కారణంగానే తాను తిరుపతికి చేరుకోవడానికి ఇంకొంత ఆలస్యమైందని ప్రధాని మోదీ వివరించారు. మాల్దీవులు, శ్రీలంకలో పర్యటన ముగించుకుని సాయంత్రం తిరుపతికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పార్టీ నేతలు ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

వాస్తవానికి షెడ్యూల్ ప్రకారమైతే ప్రధాని మోదీ సాయంత్రం 4.30 గంటలకే తిరుపతికి చేరుకోవాల్సి వున్నప్పటికీ.. శ్రీలంకలో ఆలస్యంగా బయల్దేరి కారణం చేత సాయంత్రం 5.30 తర్వాత తిరుపతికి చేరుకున్నారు. ఇదే విషయమై వివరణ ఇస్తూ కార్యకర్తలు తన కోసం ఎదురుచూసేలా చేసినందుకు ప్రధాని మోదీ వారికి క్షమాపణలు తెలిపారు. 

Trending News