ఫొని తుపాన్: విశాఖ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు

ఫొని తుపాన్: విశాఖ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు

Last Updated : May 3, 2019, 01:54 PM IST
ఫొని తుపాన్: విశాఖ నుంచి ముంబైకి ప్రత్యేక రైలు

విశాఖ: ఫొని తుపాన్ నేపథ్యంలో ఈస్ట్ కోస్ట్ రైల్వే పరిధిలో పలు రైళ్ల రాకపోకలను నిలిపేసిన ఇండియన్ రైల్వే తాజాగా మరో ప్రకటన చేసింది. 11020 నెంబర్ కలిగిన కోనార్క్ ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ ప్రకారమే విశాఖపట్నం నుంచి ముంబైలోని ఛత్రపతి శివాజీ టర్మినస్‌కి ప్రత్యేక రైలు సేవలు అందిస్తున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే పేర్కొంది. 

ఫొని తుపాన్ కారణంగా పలు రైళ్లు నిలిచిపోవడంతో అత్యవసర ప్రయాణాలను వాయిదా వేసుకున్న వారిని దృష్టిలో పెట్టుకునే ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ ప్రత్యేక రైలు సేవలు అందిస్తున్నట్టు తెలుస్తోంది.

Trending News