తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో నిలువు దోపిడీకి పాల్పడిన దొంగలు

తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దొంగలు పడ్డారు

Last Updated : Jun 22, 2018, 05:01 PM IST
తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌లో నిలువు దోపిడీకి పాల్పడిన దొంగలు

తిరుపతి-కాచిగూడ మధ్య ప్రయాణించే తిరుపతి - కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ రైలులో దోపిడీ దొంగలు ఒక పథకం ప్రకారం దోపిడీకి పాల్పడి బీభత్సం సృష్టించారు. శుక్రవారం పెద్దపప్పూరు మండలం జూటూరు స్టేషన్ వద్ద దొంగలు సిగ్నల్ తీగలు కట్ చేయడంతో సిగ్నల్స్ అందని కారణంగా ప్రమాదాల నివారణ కోసం ముందస్తు జాగ్రత్తగా ఆగిపోయిన తిరుపతి - కాచిగూడ రైలులోని ఎస్ -5, ఎస్-, బోగిల్లోకి ప్రవేశించిన దోపిడీ దొంగలు తీరిగ్గా తమ పని కానిచ్చుకుని వెళ్లినట్టు తెలుస్తోంది. ప్రయాణికులను కత్తులతో బెదిరించి వారి వద్ద ఉన్న నగలు, నగదును దుండగులు ఎత్తుకెళ్లినట్టు సమాచారం. 

బాధితుల ఫిర్యాదు మేరకు ఘటనా స్థలానికి చెరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.

Trending News