Gold Price Today: మగువలకు తీపికబురు.. తగ్గిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold and Silver Prices on 13 December 2022 In Hyderabad: హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా ఉంది.   

Written by - P Sampath Kumar | Last Updated : Dec 13, 2022, 07:29 AM IST
  • మగువలకు తీపికబురు
  • తగ్గిన బంగారం ధర
  • తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే
Gold Price Today: మగువలకు తీపికబురు.. తగ్గిన బంగారం ధర! తెలుగు రాష్ట్రాల్లో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?

Gold Rate decresed by rs 100 on 13th December 2022: గత కొన్ని రోజలుగా బంగారం ధరలు వరుసగా పెరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. నెల రోజుల్లో తులం బంగారంపై ఏకంగా రూ. 3000 పెరిగింది. అయితే పెరుగుతున్న పసిడి ధరలకు కాస్త బ్రేక్ పడింది. ఈ రోజు బంగారం ధరలు కాస్త తగ్గాయి. మంగళవారం (డిసెంబర్ 13) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర దేశీయ మార్కెట్లో రూ. 49,800లు ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,330లుగా ఉంది. నిన్నటితో పోల్చుకుంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 100.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ. 110 తగ్గింది . ఈ బంగారం ధరలు దేశీయ మార్కెట్లో ఈరోజు ఉదయం 6 గంటలకు నమోదైనవి. 

# ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 49,950 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,490గా ఉంది. 
# ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా నమోదైంది. 
# చెన్నైలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 50,450గా ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 55,040 వద్ద కొనసాగుతోంది. 
# బెంగళూరులో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,850గా నమోదవగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,390గా ఉంది. 
# కేరళలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా ఉంది.
# హైదరాబాద్‌లో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 54,330గా ఉంది. 
# విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ. 49,800.. 24 క్యారెట్ల ధర రూ. 54,330గా నమోదైంది. 
# విశాఖపట్నంలో 22 క్యారెట్ల ధర రూ. 49,800 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 54,330 వద్ద కొనసాగుతోంది. 

మరోవైపు బంగారం ధర తగ్గితే.. వెండి ధర మాత్రం పెరిగింది. మంగళవారం (డిసెంబర్ 13) దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 69,000లుగా కొనసాగుతోంది. నిన్నటితో పోల్చుకుంటే కిలో వెండి ధరపై రూ. 900 పెరిగింది. ముంబైలో కిలో వెండి ధర రూ. 69,000లుగా ఉండగా.. చెన్నైలో రూ. 72,800లుగా ఉంది. బెంగళూరులో రూ. 72,800గా ఉండగా.. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ. 72,800లుగా నమోదైంది. విజయవాడ, విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 72,800ల వద్ద కొనసాగుతోంది. 

Also Read: india vs china soldiers: భారత్, చైనా సైనికుల మధ్య మరోసారి ఘర్షణ.. పలువురికి గాయాలు

Also Read: Pragya Jaiswal: చూపులతో కవ్విస్తోన్న ప్రగ్యా జైస్వాల్.. బాలయ్య బ్యూటీ అందాల విందు  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.

 

Trending News