"అదిరింది" సినిమా ట్రైలర్ రిలీజ్

   

Last Updated : Oct 26, 2017, 09:08 PM IST
"అదిరింది" సినిమా ట్రైలర్ రిలీజ్

నేడు జీఎస్టీ లాంటి విషయాలపై ఇండియా మొత్తం చర్చకు దారితీసి సంచలనమైన తమిళ చిత్రం మెర్సల్. విజయ్ నటించిన ఈ సినిమా వసూళ్ళ పరంగా బాగానే ఉన్నా.. వివాదాల పరంగా కూడా తెచ్చుకున్న పేరు అంతా ఇంతా కాదు.  ఈ సినిమాలో జీఎస్టీ, నోట్ల రద్దు మొదలైన అంశాల విషయంలో ప్రభుత్వాన్ని  విమర్శించిన తీరు అధికార పార్టీ వర్గానికి ఆగ్రహం తెప్పించింది. దీంతో ఈ చిత్రానికి రావాల్సిన క్రేజ్ ఎప్పుడో వచ్చేసింది.  ప్రస్తుతం ఇదే సినిమా తెలుగులో "అదిరింది" పేరుతో డబ్ కాబోతోంది.ఈ సినిమా ట్రైలర్‌ గురువారం రిలీజ్ అయింది. ఈ ట్రైలర్‌లో కోవై సరళ, విజయ్ చెప్పిన డైలాగ్స్ ఆసక్తికరంగా ఉన్నాయి. ఈ సినిమా ఈనెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళ దర్శకుడు అట్లీ రాసిన ఈ కథకి, బాహుబలి రైటర్ కె.వి.విజయేంద్రప్రసాద్  కథా సహకారం అందించారు. విజయ్ సరసన సమంత, నిత్య మీనన్, కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. తేనాండల్ స్టూడియోస్ నిర్మిస్తు్న్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. ఈ సినిమా ఆంధ్ర, తమిళ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇప్పటికే నార్త్ స్టార్  ఎంటర్‌టైన్ మెంట్స్ సొంతం చేసుకుంది. 

 

Trending News