Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!

Trivikram Srinivas Remuneration: 'సూపర్ స్టార్' మహేష్ బాబుతో చేయనున్న సినిమా కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏకంగా 50 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 6, 2022, 12:25 PM IST
  • త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్
  • మహేష్ బాబుకు పోటీగా త్రివిక్రమ్ రెమ్యూనరేషన్
  • రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం
 Trivikram Remuneration: త్రివిక్రమ్ షాకింగ్ రెమ్యూనరేషన్.. 'సూపర్ స్టార్' మహేష్ బాబుకు పోటీగా!!

Trivikram Srinivas Shocking Remuneration for  #SSMB28: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసర లేదు. స్టార్ డైరెక్టర్‌లలో ఒకరైన ఆయన కుటుంబ కథా చిత్రాలు తీయడంలో దిట్ట. యాక్షన్, కామెడీ, బంధాలు, భావోద్వేగాలు ఇలా అన్ని అంశాలు ఆయన సినిమాలో ఉంటాయి. ఇక త్రివిక్రమ్ కలం నుంచి పదం జాలువారింది అంటే.. తరాలు గుర్తుంచుకుంటాయి. చచ్చిపోతున్న తెలుగుని తన సినిమాల్లో మాటలతో బతికిస్తున్నారు. పడిపోతున్న తెలుగు సాహిత్యపు విలువలని తన సినిమాల్లోని పాటలతో అందరికి తెలియజేస్తున్నారు. 

నువ్వే నువ్వే, అతడు, జల్సా, ఖలేజా, జులాయి, అత్తారింటికి దారేది, s/o సత్యమూర్తి, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు చేశారు త్రివిక్రమ్ శ్రీనివాస్. చేసింది తక్కువ సినిమాలే అయినా.. ఆయనకు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. స్టార్ హీరోలే ఆయనతో సినిమా చేయడానికి ఆసక్తి చూపిస్తారు. 'అల వైకుంఠపురము'లో బ్లాక్‌ బస్టర్ హిట్ కొట్టడంతో త్రివిక్రమ్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. దాంతో అయన తన రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసినట్టు తెలుస్తోంది.

త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి సినిమాను 'సూపర్ స్టార్' మహేష్ బాబుతో చేస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ ఏకంగా 50 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటున్నట్లు సమాచారం తెలుస్తోంది. ఈ సినిమాకి మహేష్ బాబు ఎంత వసూలు చేస్తున్నాడో.. అంతే మొత్తాన్ని త్రివిక్రమ్ కూడా అందుకోవడం గమనార్హం. అలా వైకుంఠపురములో సినిమాకు 25 కోట్లు తీసుకున్న మాటాల మాంత్రికుడు.. మహేష్ సినిమాకు తన రెమ్యూనరేషన్‌ డబుల్ చేశారు. ప్రస్తుతం తెలుగులో రాజమౌళి తర్వాత అత్యధిక పారితోషికం తీసుకుంటున్న దర్శకుడు త్రివిక్రమ్ అన్న విషయం తెలిసిందే.

'ప్రస్తుతం SSMB28' ప్రీ-ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ఈ ప్రాజెక్టుకు పట్టాలెక్కించనుంది. థమన్ మ్యూజిక్ డైరెక్టర్. త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న మూడో సినిమా ఇది. అతడు, ఖలేజా తర్వాత ఈ ఇద్దరు కలిసి చేస్తున్న సినిమా కాబట్టి భారీ అంచనాలు ఉన్నాయి. సూపర్ స్టార్ ఖాతాలో మరో హిట్ పడడం పక్కా అని ఫాన్స్ అంటున్నారు. 

Also Read: Kurnool: బస్సు సీట్ల కింద భారీ నగదు.. బనియన్లలో బంగారం.. స్వాధీనం చేసుకున్న అధికారులు

Also Read: INDW vs PAKW: హాఫ్ సెంచరీలతో ఆదుకున్న పూజా, స్నేహ్.. పాకిస్తాన్‌కు భారీ టార్గెట్!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News