Balakrishna Called Sai Reddy: విజయసాయిరెడ్డికి కాల్ చేసిన బాలకృష్ణ...చిత్తూరులో 44 రోజుల అఖండ జ్యోతి

Nandamuri Balakrishna Called Vijay Sai: విజయసాయి రెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించగా నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. ఆ వివరాలు

Written by - Chaganti Bhargav | Last Updated : Feb 2, 2023, 04:07 PM IST
Balakrishna Called Sai Reddy: విజయసాయిరెడ్డికి కాల్ చేసిన బాలకృష్ణ...చిత్తూరులో 44 రోజుల అఖండ జ్యోతి

Nandamuri Balakrishna Called Vijay Sai Reddy: నందమూరి తారక రత్న ప్రస్తుతం అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రత్న ఒకప్పుడు అనేక సినిమాల్లో హీరోగా నటించాడు కానీ కాలం కలిసి రాకపోవడంతో సినిమాలకు దూరమయ్యారు. ఈ మధ్య వెబ్ సిరీస్​లలో కూడా నటిస్తూ... మళ్ళీ నటనలో బిజీ అవుతూనే రాజకీయాల్లో కూడా తన లక్ చెక్ చేసుకోవాలని అనుకున్నాడు.

గుంటూరు జిల్లాలో ఏదో ఒక చోట నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉందని కూడా ఆ మధ్య వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ నిర్వహిస్తున్న యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవం రోజున పాదయాత్రలో పాల్గొన్న తారకరత్నకు కార్డియాక్ అరెస్ట్ కావడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు.  ఆ తర్వాత ఆయనని కుప్పం హాస్పిటల్​కి తీసుకు వెళ్లడం అక్కడి నుంచి బెంగళూరు ఆసుపత్రికి తరలించడం అందరికీ తెలిసిందే.

ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయనను బెంగళూరు వైద్యులు కాపాడారని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అక్కడ ముందు నుంచి అన్నీ తానై వ్యవహరించిన నందమూరి బాలకృష్ణ ప్రాణాపాయ స్థితి లేదని తెలుసుకొని హైదరాబాద్ వచ్చేశారు. అయితే తారకరత్న భార్య తరపు బంధువైన విజయసాయి రెడ్డి తాజాగా బెంగళూరు వెళ్లి తారకరత్నను పరామర్శించారు. తర్వాత బాలకృష్ణకు థాంక్స్ చెబుతూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి.

వారిద్దరూ ప్రత్యర్థి పార్టీలకు చెందిన వారు కావడంతో ఆయన థాంక్స్ పెట్టడమేమిటని అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే తాజాగా నందమూరి బాలకృష్ణ విజయసాయిరెడ్డికి ఫోన్ చేసినట్లుగా తెలుస్తోంది. తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? డాక్టర్లు ఏం చెప్పారు... అనే వివరాలను నందమూరి బాలకృష్ణ అడిగి తెలుసుకున్నట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి నందమూరి బాలకృష్ణ బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్​కి చైర్మన్​గా వ్యవహరిస్తున్నారు. దీంతో ఆయనకు వైద్యులకు సంబంధించి అనేక కాంటాక్ట్స్ ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే బెంగళూరులో ది బెస్ట్ హాస్పిటల్ అని తెలిసి నారాయణ హృదయాలయ హాస్పిటల్​కు తారకరత్నను తరలించారు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నందమూరి తారకరత్న కోలుకుని తిరిగి రావాలని చెబుతూ.. చిత్తూరు జిల్లాలోని మృత్యుంజయ స్వామి ఆలయంలో 44 రోజుల పాటు అఖండ జ్యోతి వెలిగించాలని తన పీఏ రవికి బాలకృష్ణ సూచించారట. చిత్తూరు జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురంలో మృత్యుంజయ స్వామి ఆలయం ఉండగా నందమూరి బాలకృష్ణ సూచనలతో ఈ ఆలయంలో తారకరత్న ఆరోగ్యం మెరుగుపడాలని ఆయన అభిమానులు ఇప్పటికే ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం బాలకృష్ణ సూచనలతో అఖండ జ్యోతి వెలిగించినట్లు సమాచారం. 

Also Read: Nayanthara Casting Couch: 'నయనతార'నూ వదలలేదు.. క్యాస్టింగ్ కౌచ్ అనుభవం బయటపెట్టేసింది!

Also Read: Nijam with Smita: సోనీ లివ్లో స్మిత షో.. చరణ్ నెపోటిజంపై నాని షాకింగ్ కామెంట్స్!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

TwitterFacebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News