'బాహుబలి'నే శాసించిన 'కరోనా'

బాహుబలి, సాహో చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో ప్రభాస్ పై... ఇప్పుడు 'కరోనా వైరస్' ఎఫెక్ట్ పడింది. 'కరోనా వైరస్' ప్రభావం కారణంగా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితమే 'కరోనా' ఎఫెక్ట్ తన మీద పడవద్దని.. ప్రభాస్ మాస్క్ తో కనిపించాడు.

Last Updated : Mar 17, 2020, 03:29 PM IST
'బాహుబలి'నే శాసించిన 'కరోనా'

బాహుబలి, సాహో చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న తెలుగు హీరో ప్రభాస్ పై... ఇప్పుడు 'కరోనా వైరస్' ఎఫెక్ట్ పడింది. 'కరోనా వైరస్' ప్రభావం కారణంగా ఇప్పుడు ప్రభాస్ సినిమా షూటింగ్ ఆగిపోయింది. కొద్ది రోజుల క్రితమే 'కరోనా' ఎఫెక్ట్ తన మీద పడవద్దని.. ప్రభాస్ మాస్క్‌తో కనిపించాడు. ఆయన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇప్పుడు తాజాగా మరోసారి..  కరోనా ఎఫెక్ట్ కారణంగా ప్రభాస్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు. 

ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న సంగతి తెలిసిందే. యూరప్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం ఓ సాంగ్ షూటింగ్ జరుగుతోంది. ఐతే జార్జియాలో షూటింగ్ జరుగుతున్న ఈ పాట చిత్రీకరణను ప్రస్తుతానికి నిలిపివేశారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా షూటింగ్‌ను ప్రస్తుతానికి నిలుపుదల చేశారు. ప్రస్తుతం జరుగుతున్న సాంగ్ చిత్రీకరణను ఆఖరి షెడ్యూల్ అయిన తర్వాత చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. 

Read Also:  'కరోనా వైరస్'కు వ్యాక్సిన్.. వచ్చేస్తోంది..!!

మరోవైపు ఈ సినిమా టైటిల్‌ను ఉగాదికి రిలీజ్ చేయాలని చిత్ర దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాకు 'రాధేశ్యామ్' లేదా 'ఓ డియర్' టైటిళ్లను పరిశీలిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత 'మహానటి' దర్శకుడు నాగ్ అశ్విన్‌తో ప్రభాస్ సినిమా చేయనున్నాడు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News