Project K Director Nag Ashwin : మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దర్శకుడిగా తెలుగు తెరపై ముద్ర వేశాడు. సెన్సిబుల్ డైరెక్టర్ అంటూ నాగ్ అశ్విన్కు మంచి క్రేజ్ ఉంది. సినిమాల గురించి తప్పా ఇంకేం మాట్లాడని నాగ్ అశ్విన్ ఇప్పుడు ప్రాజెక్ట్ కే పనుల్లో బిజీగా ఉన్నాడు. మామూలుగా బయట ఎక్కువగా కనిపించని నాగ్ అశ్విన్ తాజాగా చెడ్డి గ్యాంగ్ తమాషా మూవీ కోసం బయటకు వచ్చాడు. శుక్రవారం జరిగిన టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్ సందడి చేశాడు.
వెంకట్ కళ్యాణ్ హీరోగా అబుజా ఎంటర్టైన్మెంట్స్, శ్రీ లీల ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై చెడ్డి గ్యాంగ్ తమాషా చిత్రం రాబోతోంది. అయితే సినిమాకు వెంకట్ కళ్యాణ్ దర్శకుడిగానూ వ్యవహరిస్తున్నాడు. అయితే ఈ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్లో నాగ్ అశ్విన్తో పాటు అతని తల్లి డాక్టర్ జయంతి కూడా పాల్గొన్నారు. టీజర్ లాంచ్ తరువాత నాగ్ అశ్విన్ మాట్లాడుతూ.. ఈ చిత్ర నిర్మాతకు తమకు ఉన్న రిలేషన్ గురించి చెప్పాడు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook