Rana Daggubati: రానా దగ్గుబాటికి కోపం తెప్పించిన వార్తా కథనం

టాలీవుడ్‌లో టవర్ పర్సనాల్టీగా పేరున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) కోపమొచ్చింది. తనపై వాస్తవాలతో పనిలేకుండా లేనిపోని రూమర్స్‌తో ఓ కట్టు కథ రాశారంటూ రానా ఓ మీడియా సంస్థపై మండిపడ్డారు. రానా చేసిన ఆ ట్వీట్ చూస్తోంటే.. రానాకు బాగానే కోపమొచ్చినట్టుందని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు.

Last Updated : Mar 8, 2020, 04:37 PM IST
Rana Daggubati: రానా దగ్గుబాటికి కోపం తెప్పించిన వార్తా కథనం

Rana Daggubati: టాలీవుడ్‌లో టవర్ పర్సనాల్టీగా పేరున్న రానా దగ్గుబాటికి ( Rana Daggubati ) కోపమొచ్చింది. తనపై వాస్తవాలతో పనిలేకుండా లేనిపోని రూమర్స్‌తో ఓ కట్టు కథ రాశారంటూ రానా ఓ మీడియా సంస్థపై మండిపడ్డారు. అనిర్బన్ దాస్ బ్లా, హర్ష్ గోయెంక అనే ఇద్దరు వ్యాపారవేత్తలు ఇచ్చిన పార్టీలో రానా దగ్గుబాటిలో కూడా పాల్గొన్నాడని ఓ మీడియా సంస్థ ప్రచురించిన కథనం ఆయనకు కోపం తెప్పించింది. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొన్న ఆ ఇద్దరితో రానా దగ్గుబాటి స్నేహం చేయడం ఏంటని కొంతమంది నెటిజెన్స్ సోషల్ మీడియాలో ప్రశ్నించారు. దీంతో రానా దగ్గుబాటికి కోపం తన్నుకొచ్చింది. వాస్తవాలు తెలియకుండానే వార్తా కథనం ఎలా రాశారంటూ ఆయన ట్విటర్ ద్వారా ఆగ్రహం వ్యక్తంచేశారు. తానేంటో తెలియకుండానే ఇలాంటివి రాయడం సరైంది కాదని హితవు పలికిన రానా.. ఆ సంస్థకు చెందిన టీమ్‌ తనను సంప్రదించాల్సిందిగా కోరాడు.

తన పీఆర్ టీమ్ కూడా మీకు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని రానా తన ట్వీట్‌లో పేర్కొన్నాడు.

తాను, తన పీఆర్ టీమ్ మిమ్మల్ని సంప్రదించేందుకు ప్రయత్నిస్తున్నామని రానా చేసిన ఆ ట్వీట్ చూస్తోంటే.. రానాకు బాగానే కోపమొచ్చినట్టుందని నెటిజెన్స్ చర్చించుకుంటున్నారు. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..  

 

Trending News