శ్రీదేవి నివాసంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో మర్మం ఏంటి ?

శ్రీదేవి నివాసంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేయడానికి కారణం ఏంటి ? 

Last Updated : Feb 27, 2018, 01:18 AM IST
శ్రీదేవి నివాసంలో డాగ్ స్క్వాడ్ బృందం తనిఖీల్లో మర్మం ఏంటి ?

బాలీవుడ్ నటి శ్రీదేవి భౌతికకాయం సోమవారమే ముంబైకి చేరుతుందనే వార్తల నేపథ్యంలో పరిశ్రమకు చెందిన సన్నిహితమిత్రులు, సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు ఎందరో సోమవారం మధ్యాహ్నం నుంచే అనిల్ కపూర్ ఇంటి వద్దకు చేరుకుని ఆమెను కడసారి చూసేందుకు పడిగాపులుకాశారు. దీంతో అనిల్ కపూర్ ఇంటి వద్ద భారీ సంఖ్యలో అభిమానుల తాకిడి కనిపించింది. ముంబై నుంచే వచ్చిన సినీ ప్రముఖులు తిరిగి తమ తమ ఇళ్లకు వెళ్లిపోగా, ఆమెను కడసారి చూసుకుని నివాళి అర్పించేందుకు దేశం నలుమూలల నుంచి వచ్చిన సినీ ప్రముఖులు ముంబైలోని హోటల్స్‌లో బస చేశారు.

ఇదంతా ఇలా వుంటే, మరోవైపు సోమవారం ముంబైలోని శ్రీదేవి నివాసంలో ముంబై పోలీసులు, డాగ్ స్వ్కాడ్ బృందం సోదాలు చేపట్టినట్టు కొన్ని వార్తలు వెలువడుతున్నాయి. సాధారణంగా పోలీసులు తనిఖీలు చేయడం అంటేనే అక్కడ వారికి ఏదో అనుమానం వచ్చినట్టు అనుకోవాల్సి వుంటుంది. అందులోనూ ఏకంగా డాగ్ స్వ్కాడ్‌తో అక్కడికి చేరుకున్నారు అంటే కచ్చితంగా ఇందులో ఏదో మతలబు వుందనే అనుకోవాల్సిన అవసరం వుందంటున్నాయి ముంబై మీడియా వర్గాలు. 

అసలే శ్రీదేవి మృతిపై అనేక అనుమానాలు నెలకొన్న ప్రస్తుత తరుణంలో డాగ్ స్వ్కాడ్ బృందం ఇలా ఆమె ఇంట్లో సోదాలు జరిపారు అనే వార్తలు మరిన్ని అనుమానాలకు తావిస్తున్నాయి. ఈ వార్తలపై ప్రస్తుతం అనిల్ కపూర్ కానీ లేదా బోనీకపూర్ తరుపు వారు కానీ ఎవ్వరూ అధికారికంగా స్పందించే పరిస్థితిలో లేకపోవడంతో శ్రీదేవి మృతిపై రకరకాల పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Trending News