వెంకీ సినిమాను వదిలేసి మళ్లీ రానానే ఎంచుకున్న తేజ !

వెంకీ సినిమాను పక్కకుపెట్టి, రానా సినిమాపైనే ఫోకస్ చేస్తోన్న తేజ 

Last Updated : May 9, 2018, 08:38 PM IST
వెంకీ సినిమాను వదిలేసి మళ్లీ రానానే ఎంచుకున్న తేజ !

నేనే రాజు నేనే మంత్రి సినిమాతో దర్శకుడిగా మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి వచ్చిన తేజ ఆ తర్వాత గత డిసెంబర్‌లో వెంకీ సినిమాను లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, అదే సమయంలో బాలయ్య బాబు హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను తెరకెక్కించాల్సి రావడంతో అప్పట్లో వెంకీ సినిమాను పక్కనపెట్టేశాడు తేజ. ఇదిలావుండగా ఎన్టీఆర్ బయోపిక్ సినిమాను డైరెక్ట్ చేసే క్రమంలో బాలయ్య బాబుతో వచ్చిన విభేదాల కారణంగా ఆ సినిమా నుంచి తేజ పక్కకుతప్పుకున్నాడు. దీంతో తేజ మళ్లీ వెంకీ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్తాడనే అందరూ భావించారు. కానీ అనూహ్యంగా తేజ ఆ సినిమాను కూడా పక్కనపెట్టి ఇంకా స్క్రిప్ట్ కూడా పూర్తిగా రాసుకోని రానా సినిమాపై దృష్టి సారించడమే ప్రస్తుతం కొంత ఆసక్తిని రేకెత్తిస్తోంది. అన్నట్టుగా జూన్ తర్వాత తేజ, వెంకీ సినిమాపై ఫోకస్ చేసే అవకాశాలు లేకపోలేదు అనే టాక్ కూడా వినిపిస్తోంది కానీ అందులో క్లారిటీ లేదు. 

కారణాలు ఏవైనా వెంకీ సినిమాను పూర్తిగా పక్కకుపెట్టిన తేజ ప్రస్తుతం రానాతో చేయనున్న సినిమాపైనే ఫోకస్ చేశాడు. రానా సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధం చేసుకుంటోన్న తేజ మరో రెండు నెలల్లో ఈ సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో నేనే రాజు నేనే మంత్రి కాంబో మరోసారి ఆడియెన్స్ ముందుకు రానుందన్న మాట.  

Trending News