Update on 'Guntur Karam' Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

Pooja Hegde Replaced by Ssamyuktha Menon: గుంటూరు కారం సినిమా నుంచి పూజా హెగ్డే తప్పుకుందా..? బుట్టబొమ్మ స్థానంలో సంయుక్త మీనన్ ఎంట్రీ ఇచ్చిందా..? అంటే అవుననే మూవీ వర్గాలు చెబుతున్నాయి. పూజా తప్పుకోవడానికి కారణం ఏంటి..? సంయుక్తను ఎందుకు ఎంపిక చేశారు..?

Written by - Ashok Krindinti | Last Updated : Jun 28, 2023, 01:42 PM IST
Update on 'Guntur Karam' Movie: 'గుంటూరు కారం' నుంచి పూజా హెగ్డే ఔట్.. మరో స్టార్ హీరోయిన్ ఎంట్రీ..?

Pooja Hegde Replaced by Ssamyuktha Menon: సూపర్ స్టార్ మహేశ్ బాబు-మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గుంటూరు కారం. ఈ క్రేజీ కాంబోలో దాదాపు 12 ఏళ్ల తరువాత సినిమా వస్తుండడతో అభిమానులకు భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే మొదటి నుంచి ఈ మూవీకి ఆటంకాలు ఎదురవుతున్నాయి. మధ్యలో కొద్ది రోజులు షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయంలో మహేష్ బాబు సీరియస్‌గా ఉన్నారని.. ఆయనను సినిమా నుంచి తప్పించారని రూమర్లు వచ్చాయి. అయితే ఈ విషయాన్ని మూవీ యూనిట్ ఖండించింది. తాజాగా మరో వార్త ఫిల్మ్ సర్కిల్‌లో వైరల్ అవుతోంది. గుంటూరు కారం నుంచి బుట్టబొమ్మ పూజా హెగ్డే స్థానంలో మరో హీరోయిన్‌ను సెలక్ట్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

మూవీ అనౌన్స్‌మెంట్ సమయంలో పూజా హెగ్డేను మాత్రమే హీరోయిన్‌గా చిత్ర బృందం ప్రకటించింది. ఆ తరువాత శ్రీలలను ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు తాజాగా పూజా స్థానంలో మలయాళీ బ్యూటీ సంయుక్త మీనన్‌ను ఎంపిక చేసినట్లు గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. ఇప్పటికే సంయుక్తను హీరోయిన్‌గా గురూజీ ఒకే చేశారని టాక్ వస్తోంది. మూవీ యూనిట్ స్పందిస్తేనే ఈ విషయంపై క్లారిటీ రానుంది. 

Also Read: YSR Law Nestham Scheme: గుడ్‌న్యూస్.. నేడే అకౌంట్‌లో రూ.25 వేలు జమ

సంయుక్త మీనన్ వరుస హిట్స్‌తో గోల్డెన్‌ బ్యూటీగా పేరు తెచ్చుకుంది. భీమ్లా నాయక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ భామ.. బింబిసార, సార్ సినిమాలో హిట్స్ అందుకుంది. రీసెంట్‌ విరూపాక్ష సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ తన ఖాతాలో వేసుకుంది. భీమ్లా నాయక్ మూవీ సమయంలోనే సంయుక్త మీనన్‌ యాక్టింగ్‌పై త్రివిక్రమ్ మంచి ఓపెనియన్ క్రియేట్ అయినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గుంటూరు కారం సినిమాలో ఛాన్స్ ఇచ్చినట్లు సమాచారం.

ప్రస్తుతం పూజా హెగ్డే హిందీ, కన్నడ, తమిళ సినిమాలతో బిజీగా ఉంది. అయితే ఈ సినిమాల షెడ్యూల్ కొంచెం అటు ఇటు కావడంతో గుంటూరు కారం సినిమాకు డేట్స్ ఇవ్వడం కష్టమవుతోందని సినీ వర్గాలు చెబుతున్నాయి. డేట్స్ క్లాష్ కాకూడదనే ఉద్దేశంతోనే గుంటూరు కారం నుంచి పూజా దూరమైందని అంటున్నారు. 

అతడు, ఖలేజా సినిమాల అనంతరం దాదాపు 12 ఏళ్ల గ్యాప్ తరువాత త్రివిక్రమ్‌తో మూవీకి మహేష్ బాబు ఒకే చేసిన విషయం తెలిసిందే. హారిక అండ్ హాసిని క్రియేషన్స్‌పై ఎస్.రాధాకృష్ణ (చినబాబు) నిర్మిస్తున్నారు. జగపతి బాబు విలన్ రోల్ పోషిస్తున్నారు. ఇటీవల రిలీజ్ అయిన టైటిల్ గ్లింప్స్‌కు ఫ్యాన్స్‌ నుంచి భారీ రెస్పాన్స్ వచ్చింది. మహేష్ బాబు లుక్‌కు ఫిదా అయిపోయారు. వచ్చే ఏడాది జనవరి 13న గుంటూరు కారం ఆడియన్స్ ముందుకురానుంది.

Also Read: Hyderabad Weather News: హైదరాబాద్‌లో భారీ వర్షాలు.. తెలంగాణకు ఎల్లో అలర్ట్ జారీ.. ఏపీలో పరిస్థితి ఇలా..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe

TwitterFacebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News