తల్లి చీర కట్టుకొని అవార్డు అందుకున్న శ్రీదేవి కూతురు

బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ రోజు జాతీయ చలనచిత్ర అవార్డులకు తన తల్లి చీర ధరించి వచ్చారు

Last Updated : May 4, 2018, 02:56 PM IST
తల్లి చీర కట్టుకొని అవార్డు అందుకున్న శ్రీదేవి కూతురు

బాలీవుడ్ నటి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ఈ రోజు జాతీయ చలనచిత్ర అవార్డులకు తన తల్లి చీర ధరించి వచ్చారు. తన తండ్రి, సోదరితో కలిసి ఆమె రాష్ట్రపతి చేతులమీదుగా శ్రీదేవికి దక్కాల్సిన అవార్డును అందుకున్నారు.

"మామ్" చిత్రంలో నటనకు గాను శ్రీదేవికి జాతీయ అవార్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. 7 జూన్ 2017 తేదిన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 
"మామ్" చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు.

గిరీష్ కోహ్లీ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే సమకూర్చగా.. రవి ఉద్యవర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో శ్రీదేవితో పాటు నవాజుద్దీన్ సిద్దీఖీ, అక్షయ్ ఖన్నా, సజల్ ఖాన్ ఇతర పాత్రలు పోషించారు. "మామ్" చిత్రంలో నటనకు గాను శ్రీదేవి విమర్శకుల ప్రశంసలు కూడా పొందారు. 

Trending News