హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య!

హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 17 మంది మృతి! 

Last Updated : Feb 12, 2019, 10:27 AM IST
హోటల్లో ఘోర అగ్ని ప్రమాదం.. 17కు చేరిన మృతుల సంఖ్య!

న్యూఢిల్లీ: ఢిల్లీలోని కరోల్‌బాఘ్‌లో వున్న హోటల్ అర్పిత్ ప్యాలెస్‌లో మంగళవారం ఉదయం ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. తెల్లవారుజామున చోటుచేసుకున్న ఈ అగ్ని ప్రమాదంలో మొదట 9 మంది చనిపోగా ఆ తర్వాత మృతుల సంఖ్య తొలుత 13కు, ఆ తర్వాత 17కు చేరింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ అధికారులు 30 ఫైర్ ఇంజిన్లతో ఘటనాస్థలికి చేరుకుని సహాయ చర్యలు ప్రారంభించారు. గాయపడిన క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 25 మందిని అగ్ని ప్రమాదం బారి నుంచి కాపాడినట్టు సమాచారం అందుతోంది. ప్రస్తుతానికి మంటలు ఆర్పి శవాలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరిగే ప్రమాదం ఉందని తెలుస్తోంది.

ఈ అగ్ని ప్రమాదం బారి నుంచి తప్పించుకునేందుకు ఇద్దరు హోటల్ సిబ్బంది 4వ అంతస్తుపై నుంచి దూకారు. అయితే, ఆ ఇద్దరి పరిస్థితి ఏంటనేది ఇంకా తెలియరాలేదు.

Trending News