వీడియో: సీఎం సమక్షంలోనే వేదికపై ఇద్దరు నేతల ఫైట్

సీఎం సమక్షంలోనే వేదికపై ఇద్దరు నేతల ఫైట్  

Last Updated : Sep 22, 2018, 08:45 PM IST
వీడియో: సీఎం సమక్షంలోనే వేదికపై ఇద్దరు నేతల ఫైట్

ముఖ్యమంత్రి వేదికపై ఉండగానే, అదే వేదికపై ముఖ్యమంత్రి సమక్షంలోనే ఇద్దరు బీజేపీ నేతలు తగవులాడుకున్న ఘటన రాజస్తాన్‌లోని అల్వార్‌లో చోటుచేసుకుంది. శనివారం జరిగిన ఓ ప్రజా కార్యక్రమానికి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజె హాజరయ్యారు. అదే కార్యక్రమంలో బీజేపీకే చెందిన మరో ఇద్దరు నేతలు రోహితాష్ శర్మ, దేవి సింగ్ షెకావత్ కూడా పాల్గొన్నారు. ఈ కార్యక్రమం జరుగుతుండగానే రోహితాష్ శర్మ, దేవి సింగ్ షెకావత్ మధ్య వాగ్వీవాదం జరిగి, ఇద్దరూ తగవులాడుకునే వరకు వెళ్లింది. దీంతో వెంటనే అప్రమత్తమైన ముఖ్యమంత్రి భద్రతా సిబ్బంది దేవి సింగ్ షెకావత్‌ను వేదికపై నుంచి కిందకు లాక్కొచ్చేశారు. 

అనంతరం నేతలు ఇద్దరూ వేర్వేరుగా మీడియాతో మాట్లాడుతూ.. ఒకరిపై మరొకరు పరస్పరం విమర్శలు చేసుకున్నారు. దీంతో పార్టీలోనే పలువురు నేతల మధ్య ఉన్న అసహన వైఖరి సీఎం సాక్షిగానే బయటపడినట్టయింది.

Trending News