'కరోనా వైరస్'కు మందు ఇదేనంటున్న బీజేపీ ఎమ్మెల్యే

'కరోనా వైరస్' ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 60 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. బిక్కు బిక్కుమంటూ జనం వైద్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది.

Last Updated : Mar 3, 2020, 11:25 AM IST
'కరోనా వైరస్'కు మందు ఇదేనంటున్న బీజేపీ ఎమ్మెల్యే

'కరోనా వైరస్' ప్రపంచమే గడగడలాడుతోంది. ఇప్పటికే 60 దేశాల ప్రజలు గజ గజా వణుకుతున్నారు. ఇప్పటి వరకు ఈ వైరస్ కు మందు కనుగొన లేదు. కనీసం వ్యాక్సిన్ కూడా అందుబాటులో లేదు. బిక్కు బిక్కుమంటూ జనం వైద్యం కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ కరోనా వైరస్ కు బీజేపీ ఎమ్మెల్యే ఒకరు మందు కనిపెట్టారు. 

Read Also: కరోనా ఎఫెక్ట్: కొత్త తరహా పలకరింపు
శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్న 'కరోనా వైరస్'కు మందు తాను కనిపెట్టానంటున్నారు బీజేపీ ఎమ్మెల్యే సుమన్ హరిప్రియ. అసోంలో అసెంబ్లీ సాక్షిగా ఆమె మందును ప్రకటించారు. కరోనా వైరస్ నుంచి ఉపశమనం లభించాలంటే గోమూత్రం, ఆవు పేడ చక్కని వైద్యంగా పేర్కొన్నారు. వీటితో వైరస్ ను సులభంగా తరిమికొట్టవచ్చని చెప్పారు. 
Read Also: ముద్దులు వద్దు..!!
అంతేకాదు పురాతన కాలం నుంచి భారత దేశంలో గోమూత్రం, ఆవు పేడను ఔషధంగా ఉపయోగిస్తున్నారని ఆమె పేర్కొన్నారు. వాటితో కరోనా వైరస్ దరి చేరదని తాను నమ్ముతున్నట్లు తెలిపారు. ఆవు పేడ చల్లితే 5 కిలోమీటర్ల వరకు దాని ప్రభావం ఉంటుందని.. ప్రభుత్వం దీన్ని అమలు చేయాలని ఉచిత సలహా కూడా ఇచ్చారు.  See Pics: గుర్రపు స్వారీ చేసిన ముద్దుగుమ్మ
 జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News