Lockdown in Delhi ?: ఢిల్లీలో లాక్‌డౌన్.. సీఎం కేజ్రీవాల్ ఏం చెబుతున్నారంటే..

No lockdown in Delhi: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడం లేదని ఢిల్లీ సర్కార్ పెద్దలు తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఎప్పుడు, ఏ క్షణం లాక్‌డౌన్ విధిస్తారో ఏమోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 2, 2021, 09:00 PM IST
  • ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడం లేదని తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తోన్న ఢిల్లీ సర్కార్ పెద్దలు.
  • ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉన్న పెరుగుతున్న COVID-19 కేసులు.
  • లాక్‌డౌన్ ఊహాగానాలపై ఇటీవల ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, తాజాగా సీఎం కేజ్రీవాల్ ప్రకటన
Lockdown in Delhi ?: ఢిల్లీలో లాక్‌డౌన్.. సీఎం కేజ్రీవాల్ ఏం చెబుతున్నారంటే..

No lockdown in Delhi: న్యూ ఢిల్లీ: ఢిల్లీలో లాక్‌డౌన్ విధించడం లేదని ఢిల్లీ సర్కార్ పెద్దలు తరచుగా మీడియా ఎదుట ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. ఢిల్లీలో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న తీరు మాత్రం ఢిల్లీవాసులను ఆందోళనకు గురిచేస్తూనే ఉంది. కొవిడ్-19 కేసులు పెరుగుతున్న తీరు చూస్తే ఎప్పుడు, ఏ క్షణం లాక్‌డౌన్ విధిస్తారో ఏమోననే ఆందోళన వారిలో స్పష్టంగా కనిపిస్తోంది. అందుకు తగినట్టుగానే సోషల్ మీడియాలోనూ 'ఢిల్లీలో లాక్‌డౌన్ విధించే అవకాశాలు' అంటూ వస్తున్న కథనాలు వారిని మరింత అయోమయానికి గురిచేస్తున్నాయి. ఇటీవలే ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్ ఇదే విషయమై మాట్లాడుతూ ''ఢిల్లీలో లాక్‌డౌన్ విధించాలనే యోచనలో ఢిల్లీ సర్కార్ ( Delhi govt) లేదని, కరోనా కట్టడికి కేవలం లాక్‌డౌన్ ఒక్కటే సరైన పరిష్కారం కూడా కాదు'' అని అభిప్రాయపడ్డారు. 

Also read : CBSE Board Exams 2021: సీబీఎస్ఈ 10వ తరగతి, 12వ తరగతి పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన బోర్డ్

తాజాగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సైతం 'ఢిల్లీలో లాక్‌డౌన్ విధింపు' అంశంపై మరోసారి స్పష్టత ఇచ్చారు. ''గత 24 గంటల్లో ఢిల్లీలో కొత్తగా 3,583 కరోనావైరస్ కేసులు నమోదయ్యాయి. కరోనావైరస్ కేసులు ఇప్పుడు పెరుగుతున్న తీరును ఫోర్త్ వేవ్ అనుకోవచ్చు. కరోనానా కట్టడి చేసేందుకు తీసుకోవాల్సిన అన్ని చర్యలు తీసుకుంటున్నాం. ఢిల్లీలో కేసులు పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోనే ఉంది. జనం ఆందోళన చెందాల్సిన అవసరరం లేదు'' అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ (Satyendar Jain), ఇతర ఉన్నతాధికారులతో కలిసి అత్యవసర సమీక్ష చేపట్టిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కేజ్రీవాల్ (Delhi CM Arvind Kejriwal) ఈ వ్యాఖ్యలు చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News