India: 30 లక్షలు దాటిన కరోనా కేసులు

భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది. అయితే దేశంలో కరోనా కేసుల మార్క్ 30లక్షలు దాటింది. 

Last Updated : Aug 23, 2020, 10:07 AM IST
India: 30 లక్షలు దాటిన కరోనా కేసులు

India Covid-19 updates: న్యూఢిల్లీ: భారత్‌లో కరోనావైరస్ ( Coronavirus) మహమ్మారి వ్యాప్తి వేగంగా విస్తరిస్తోంది. నిత్యం కరోనా కేసులు, మరణాల సంఖ్య దేశంలో పెరుగుతూనే ఉంది. అయితే దేశంలో కరోనా కేసుల మార్క్ 30లక్షలు దాటింది. గత 24 గంటల్లో ( ఆగస్టు 22 ) కొత్తగా 69,239 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ ( Health Ministry )
ఆదివారం తెలిపింది. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా నిన్న 912 మంది ప్రాణాలు కోల్పోయారని వెల్లడించింది. తాజాగా నమోదైన కేసులతో దేశవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 30,44,941కి పెరగగా.. మరణాల సంఖ్య 56,706కు చేరుకుంది. Also read: 
Covid-19: తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

దేశవ్యాప్తంగా ప్రస్తుతం 7,07,668 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉండగా.. ఇప్పటివరకు ఈ మహమ్మారి నుంచి 22,80,567 మంది బాధితులు కోలుకున్నట్లు వెల్లడించింది. ఇదిలాఉంటే.. దేశవ్యాప్తంగా శనివారం 8,01,147 కరోనా టెస్టులు చేసినట్లు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ( ICMR ) వెల్లడించింది. ఆగస్టు 22 వరకు 3,52,92,220 నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ తెలిపింది.  Also read: Babri Masjid demolition case: బాబ్రీ కేసులో తీర్పునకు ‘సుప్రీం’ కొత్త డెడ్‌లైన్

Trending News