Oxford Vaccine: ఇండియాలో మూడవ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్

ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ వ్యాక్సిన్ కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ( 3rd Phase Trials ) మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford Vaccine ) వ్యాక్సిన్ తుది ట్రయల్స్ ను ఇండియాలో ఆగస్టు నెలలో జరపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

Last Updated : Jul 23, 2020, 06:14 PM IST
Oxford Vaccine: ఇండియాలో మూడవ ఫేజ్ వ్యాక్సిన్ ట్రయల్స్

ప్రపంచం ఎదురుచూస్తున్న ఆ వ్యాక్సిన్ కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ( 3rd Phase Trials ) మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ ( Oxford Vaccine ) వ్యాక్సిన్ తుది ట్రయల్స్ ను ఇండియాలో ఆగస్టు నెలలో జరపబోతున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది.

కరోనా వైరస్ కు వ్యాక్సిన్ ను కొనుగొనే రేసులో ముందున్న ఆక్స్ ఫర్డ్ యూనివర్శిటీ నుంచి మరో కీలకమైన వార్త వెలువడింది. కోవిషీల్డ్ ( Covishield ) గా పిలుస్తున్న ఈ వ్యాక్సిన్ ను ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి, సరఫరా చేసే ఒప్పందం ఇండియాకు చెందిన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో ( Serum Institute of India ) జరిగిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనెకా ( Oxford- Astrazeneca ) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ తొలి రెండు దశల హ్యూమన్ ట్రయల్స్ విజయవంతమైనట్టు కంపెనీ ప్రకటించింది. కీలకమైన మూడవ దశ ట్రయల్స్ ఆగస్టులో ఇండియాలో ప్రారంభం కానున్నట్టు ఆక్స్ ఫర్డ్ తో ఒప్పందమైన సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. 4 -5 వేల మంది వాలంటీర్లపై మూడవ దశ ట్రయల్స్ ను జరపనున్నట్టు సీరమ్ ఇనిస్టిట్యూట్ తెలిపింది. Also read: Covid19 Vaccine: ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ పేరేంటో తెలుసా?

Covishield Vaccine 3rd phase trials

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ కోవిషీల్డ్ లో మెరుగైన టీ సెల్స్ రెస్పాన్స్ ( T Cell Response ) కన్పించిందని...దీనర్ధం వైరస్ ను దీర్ఘకాలం ఎదుర్కొనే సామర్ధ్యం వ్యాక్సిన్ కు ఉందని కంపెనీ తెలిపింది. అన్నీ అనుకున్నట్టు సజావుగా జరిగితే దాదాపు 3-4 వందల మిలియన్ డోసుల్ని డిసెంబర్ 2020 నాటికి ఉత్పత్తి చేస్తామని కంపెనీ సీఈవో అదార్ పూణావాలా ఇప్పటికే స్పష్టం చేశారు. ఉత్పత్తి చేసే వ్యాక్సిన్ లో 50 శాతం ఇండియాకే కేటాయించనున్నట్టు కూడా కంపెనీ ప్రకటించి ఉంది. Also read: Oxford Vaccine: ఆ వ్యాక్సిన్ లో సగం భారత్ కే

Trending News