ఢిల్లీలో దారుణం: స్కూలుబస్ పై దాడి.. బాలుడి కిడ్నాప్

ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. స్కూలు బస్సును ఆపి ఆగంతకులు డ్రైవరును హతమార్చి, ఒకటవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేశారు.

Last Updated : Jan 25, 2018, 01:42 PM IST
ఢిల్లీలో దారుణం: స్కూలుబస్ పై దాడి.. బాలుడి కిడ్నాప్

ఢిల్లీలో పట్టపగలే దారుణం చోటు చేసుకుంది. స్కూలు బస్సును ఆపి ఆగంతకులు డ్రైవరును హతమార్చి, ఒకటవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థిని కిడ్నాప్ చేశారు. తెల్లవారుఝామున ఉదయం 7:40 గంటల ప్రాంతంలో దాదాపు 25 విద్యార్థులు ఉన్న స్కూలు బస్‌ని ఆపి నార్త్ ఈస్ట్ ఢిల్లీలో ఈ దారుణానికి ఒడిగట్టారు దుండగులు. నిన్న కూడా ఇలాగే ఢిల్లీలో ఓ స్కూలుబస్సుపై విరుచుకుపడ్డారు దుండగులు. 'పద్మావత్' సినిమాను వ్యతిరేకిస్తూ సాగిన ధర్నా హింసాత్మకంగా మారిన తర్వాత గురుగ్రామ్ దగ్గర ఓ స్కూలుబస్సుపై దాడి చేశారు. ఈ ఘటన జరిగి మరో రోజు కూడా గడవక మునుపే మళ్లీ అలాంటి ఘటనే చోటుచేసుకోవడం గమనార్హం. తాజాగా జరిగిన ఘటనలో విద్యార్థిని కిడ్నాప్ చేసిన వ్యక్తి నల్లటి ముసుగు ధరించి ఉన్నాడని.. డ్రైవర్‌ పై కాల్పులు జరిపి.. కుర్రాడిని బైక్ పైకెక్కించుకొని యూపీ రూట్ వైపు వెళ్లాడని ఈ ఘటనకు సాక్షులైన పలువురు విద్యార్థులు చెబుతున్నారు. ప్రస్తుతం ఆ ఘటనకు సంబంధించి ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు

Trending News