Supreme court: మొహర్రమ్ ఊరేగింపునకు సుప్రీం.. నో

మొహర్రం ఊరేగింపులు ( Moharram procession ) అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దేశవ్యాప్తంగా అనుమతించడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటీషనర్ కు సూచించింది.

Last Updated : Aug 27, 2020, 06:56 PM IST
 Supreme court: మొహర్రమ్ ఊరేగింపునకు  సుప్రీం.. నో

మొహర్రం ఊరేగింపులు ( Moharram procession ) అత్యున్నత న్యాయస్థానం నో చెప్పింది. దేశవ్యాప్తంగా అనుమతించడం ద్వారా ప్రజారోగ్యాన్ని ప్రమాదంలో పడేసినట్టేనని కోర్టు అభిప్రాయపడింది. హైకోర్టుకు వెళ్లాల్సిందిగా పిటీషనర్ కు సూచించింది.

దేశవ్యాప్తంగా మొహర్రం ఊరేగింపులకు అనుమతివ్వాలని కోరుతూ షియా వర్గానికి చెందిన ఓ నేత సుప్రీంకోర్టు ( Supreme court ) ను ఆశ్రయించారు. దీనిపై విచారించిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్( Chief justice ) ఎస్ఏ బాబ్డే, జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ లతో కూడిన ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. దేశమంతటికీ సాధారణ ఉత్తర్వులను ఎలా జారీ చేస్తామని ప్రశ్నిస్తూ...అలహాబాద్ హైకోర్టు ( Allahabad high court ) లో అప్పీలు చేసుకోవల్సిందిగా పిటీషనర్ కు సూచించింది. అంతేకాకుండా ఊరేగింపులకు అనుమతివ్వడం సాధ్యం కాదని..ఇది గందరగోళానికి తావివ్వడమే కాకుండా కోవిడ్ 19 వ్యాప్తికి ( Covid 19 spread ) ఓ వర్గాన్ని టార్గెట్ చేసే అవకాశముందని కోర్టు స్పష్టం చేసింది. పెద్ద సంఖ్యలో ప్రజల ఆరోగ్యానికి ముప్పు కలిగించే ఆదేశాలు జారీ చేయలేమని చెప్పింది. పూరీ జగన్నాధ్ రధయాత్ర ( puri jagannath procession ) ఓ నిర్ధిష్ట ప్రాంతానికి సంబంధించినదని..అందుకే దానికి తగ్గట్టుగా ఆదేశాలు జారీ చేశామని కోర్టు తెలిపింది. అదే విధంగా కేవలం లక్నోకే పరిమితమయ్యేలా పరిమిత సంఖ్య ప్రార్ధనలు చేసుకునేలా అనుమతిని అలహాబాద్ కోర్టులో కోరవచ్చని పిటీషనర్ కు సూచించింది. Also read: Krishan Pal Gurjar: మరో కేంద్ర మంత్రికి కరోనా

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x