Tamil Nadu Assembly Elections 2021: డీఎంకే, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం, మరో కొత్త సీటు ఆఫర్ ఇచ్చిన DMK

Congress DMK Seat Sharing In Tamil Nadu Assembly Elections 2021 | ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. అసెంబ్లీ సీట్లతో పాటు కన్యాకుమారి లోక్‌సభ స్థానాన్ని సైతం కాంగ్రెస్ పార్టీకి కేటాయించారు.

Written by - Shankar Dukanam | Last Updated : Mar 7, 2021, 11:36 AM IST
  • కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు
  • రాజకీయాల్లోకి రావడంలేదని తలైవా సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం ప్రకటన
  • మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి 25 అసెంబ్లీ స్థానాలను డీఎంకే అధిష్టానం కేటాయించింది
Tamil Nadu Assembly Elections 2021: డీఎంకే, కాంగ్రెస్ సీట్ల సర్దుబాటుపై కీలక నిర్ణయం, మరో కొత్త సీటు ఆఫర్ ఇచ్చిన DMK

Tamil Nadu Assembly Elections 2021: దక్షిణాదిన తమిళనాడు ఎన్నికలు అంటేనే దేశమంతా ప్రత్యేకంగా చూస్తుంది. కానీ నాలుగు దశబ్దాల తరువాత మాజీ ముఖ్యమంత్రులు కరుణానిధి, జయలలిత లేకుండా జరుగుతున్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు కావడంతో ఉత్కంఠ నెలకొంది. దానికి తోడు తాను రాజకీయాల్లోకి రావడంలేదని తలైవా సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం తన నిర్ణయాన్ని వెల్లడించిన అనంతరం జరగబోతున్న అసెంబ్లీ ఎన్నికల కోసం తమిళ రాజకీయాలు మళ్లీ మొదలయ్యాయి.

ఈ క్రమంలో ప్రతిపక్ష డీఎంకే, కాంగ్రెస్ పార్టీల మధ్య సీట్ల సర్దుబాటుపై స్పష్టత వచ్చేసింది. మిత్రపక్షం కాంగ్రెస్ పార్టీకి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో(Tamil Nadu Assembly Elections) 25 స్థానాలను డీఎంకే అధిష్టానం కేటాయించింది. ఈ మేరకు ఆదివారం నాడు చెన్నైలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో రెండు పార్టీలకు చెందిన కీలక నేతలు సమావేశమై చర్చించారు. సీట్ల సర్దుబాటుకు అంగీకారం తెలుపుతూ డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ సమక్షంలో నేతలు ఆదివారం ఉదయం సంతకాలు చేశారు. మరోవైపు సీపీఐకి సైతం 6 సీట్లు కేటాయించారు.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధరలు, Silver Price

సీట్ల సర్దుబాటు అనంతరం కాంగ్రెస్ పార్టీ తమిళనాడు(Tamil Nadu) అధ్యక్షుడు కేఎస్ అళగిరి మీడియాతో మాట్లాడారు. డీఎంకే పార్టీ అధినేత స్టాలిన్‌తో కాంగ్రెస్ పార్టీ నేతల చర్చలు సఫలం అయ్యాయని, సీట్ల సర్దుబాటు సరిగా జరిగిందన్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమకు 25 సీట్లు కేటాయించారని తెలిపారు. దాంతోపాటుగా కన్యాకుమారి లోక్‌సభ సీటుకు జరగనున్న ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకే సీటు కేటాయించారని పేర్కొన్నారు.

Also Read: WhatsApp Privacy Policy అంగీకరించకపోతే వినియోగదారులకు వాట్సాప్ సేవలు బంద్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News