Tamilnadu politics: తమిళ రాజకీయాలకు గుడ్ బై చెప్పిన శశికళ, హాట్‌టాపిక్‌గా మారిన ప్రకటన

Tamilnadu politics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి, తమిళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

Last Updated : Mar 3, 2021, 11:02 PM IST
  • తమిళ రాజకీయాలకు, ప్రజా జీవితానికి గుడ్ బై చెప్పిన శశికళ
  • తమిళనాట చర్చనీయాంశంగా మారిన శశికళ సంచలన నిర్ణయం
  • అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో శశికళ తీసుకున్న నిర్ణయంపై వేర్వేరు ఊహాగానాలు
 Tamilnadu politics: తమిళ రాజకీయాలకు  గుడ్ బై చెప్పిన శశికళ, హాట్‌టాపిక్‌గా మారిన ప్రకటన

Tamilnadu politics: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తమిళనాట ఊహించని పరిణామం చోటుచేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత నెచ్చెలి, తమిళ చిన్నమ్మ శశికళ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆమె చేసిన ప్రకటన తమిళ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.

మరికొద్ది రోజుల్లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు(Tamilnadu assembly elections)జరగనున్నాయి. ఈ తరుణంలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి , దివంగత జయలలిత నెచ్చెలి శశికళ( Sasikala) అలియాస్ చిన్నమ్మ తీసుకున్న నిర్ణయం, చేసిన ప్రకటన సంచలనంగా మారింది.  తమిళనాడు రాజకీయాలకు గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించి సంచలనం రేపారు.  రాజకీయాలకు, ప్రజా జీవితానికి గుడ్ బై చెబుతున్నట్టు ప్రకటించారు. రాజకీయాల్లో రావడం లేదని స్పష్టం చేశారు. అన్నాడీఎంకే కార్యకర్తలు ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. డీఎంకే కుటుంబపాలన రాకుండా..అమ్మ పాలన కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. 

తమిళనాట చిన్నమ్మ చేసిన ప్రకటన హాట్‌టాపిక్‌గా మారింది. తనకు పదవుల మీద, అధికారం మీద ముందు నుంచీ ఆసక్తి లేదని స్పష్టం చేశారు. అమ్మ జయలలిత అభిమానులు అందరూ ఏకమై డీఎంకేను ఓడించాలని శశికళ పిలుపునిచ్చారు.  బెంగళూరు జైలు నుంచి విడుదలయ్యాక వాస్తవానికి అన్నాడీఎంకే(AIADMK) పార్టీని మళ్లీ కైసవం చేసుకుంటారనే వార్తలు విన్పించాయి. ఆమెకు చెక్ పెట్టేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి  పళనిస్వామి( Palaniswamy), డిప్యూటీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వమ్‌లు కూడా ప్రయత్నించారు. మరోవైపు AMMK పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేసుకోవాలంటూ తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి, ఆ పార్టీ జనరల్ సెక్రటరీ పన్నీర్ సెల్వం మీద కేంద్రంలోని అధికార బీజేపీ (BJP) ఒత్తిడి చేసినట్టు కూడా ప్రచారం జరిగింది. ఈ నేపధ్యంలో ఒక్కసారిగా తమిళ రాజకీయాలకు గుడ్ బై చెబుతూ ప్రకటన విడుదల చేయడం నిజంగానే సంచలనంగా మారింది. 

Also read: RBI Recruitment 2021: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 841 పోస్టులకు నోటిఫికేషన్, 10వ తరగతితో ఆర్‌బీఐలో కొలువు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News